Good News: కేంద్ర ప్రభుత్వ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించేందుకు గడువును పెంచింది. ఫిబ్రవరి 28, 2022 వరకూ పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షనర్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని సమర్పించేందుకు ఫ్రిబవరి 28వరకూ పొడిగించాలని నిర్ణయించినట్లు పెన్షన్ల విభాగం పెన్షనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అప్పటి వరకూ వారి పెన్షన్ పంపిణీకి ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపింది.
Read More:AP Govt: ఏపిలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు..
Good News: లైఫ్ సర్టిఫికెట్ ఫిబ్రవరి 28వ తేదీలో సమర్పించవచ్చు
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఫెన్షన్ తీసుకునే వారు నవంబరం నెలలో కఛ్చితంగా లైఫ్ సర్టిఫికెట్ ను అందజేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ప్రభుత్వం నుండి పెన్షన్ నిలుపుదల చేయకుండా పంపిణీ జరుగుతుంది. అయితే ఈ సారి ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును పొడిగించింది. జీవన్ ప్రమాణ్ వెబ్ పోర్టల్, పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా అయితే ఫిబ్రవరి 28వ తేదీలో గా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. లైఫ్ సర్టిఫికెట్ ధాఖలునకు గడువు పెంపుతో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఊరట లభించినట్లు అయ్యింది.
Read More: YCP MLA: నేను అలా అనలేదు..! ఉండవల్లి శ్రీదేవి షాకింగ్ సమాధానం..!!