కోటీశ్వరుడు.. ఇది ఎంతో మంది జీవిత కల. దీన్ని సాకారం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాల్లో ఉన్న డబ్బులను పోగొట్టుకుని అప్పులపాలు అయివారు ఎందరో.. అయితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులను సంపాధించడానికి వీలైన మార్గం మాత్రం స్టాక్ మార్కెట్ అని భావిస్తుంటారు. అందుకే దాచుకున్న కొంత డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు.
కానీ అందులో సరైన అనుభవం లేక కావొచ్చు, పెట్టుబడి పెట్టిన కంపనీ దివాళ తీయడం కావొచ్చు.. కొందరిని అప్పుల పాలు చేస్తాయి. దాంతో చేసేది ఏమీ లేక ఆ కలను కలలాగే ఉంచి.. అప్పులను తీర్చే పనిలో పడిపోతారు చాలా మంది. అయితే మీకు ఇప్పుడు కోటీశ్వరుడు కావాలని ఉంటే మాత్రం సువర్ణ అవకాశం మీ ముందుకు వచ్చింది. తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులు అయ్యే అవకాశం మీకు ఉంది. ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి గ్యారంటీ కూడా లభిస్తోంది.
డబ్బు సంపాదించాలనే కోరిక ఇలా తీర్చుకోవచ్చని పలువురు ఈ స్కీమ్ గురించి చెబుతున్నారు. ఈ స్కీమ్ లో డబ్బు ఆదా చేయడం వలన అదిరిపోయే రాబడి పొందొంచ్చని చెబుతున్నారు. అదే స్మాల్ సేవింగ్ స్కీమ్స్. ఈ స్కీమ్ లలో డబ్బులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందొచ్చు. అయితే ఇప్పుడు ఆ స్కీమ్ లను పోస్టాఫీస్ కూడా అందిస్తోంది. ఇందులో ఫైసలను పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదని పలువురు చెబుతున్నారు. తప్పకుండా లాభం ఉంటుందని అంటున్నారు.
పోస్టాఫీస్ ఈ స్కీమ్ తీసుకోవాలని అనుకుంటే 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల కాల పరిమితితో పలు స్కీములు అందుబాటులో ఉన్నాయి. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఆర్డీ, కిసాన్ వికాస్ పత్ర లాంటి పథకాలను ఈ స్కీములకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదేకాకుండా కొన్ని స్కీముల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం ఉంది.
ఇందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ మెచ్యూరిటీ టైం 15 ఏళ్లు. నెలకు రూ.12,500 వరకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. వడ్డీ రేటు 7.1% లభిస్తోంది. ఇలా 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే.. మనకు ఏకంగా రూ.1.03 కోట్లు వస్తాయి. అలాగే రికరింగ్ డిపాజిట్ లోనూ డబ్బులు పెట్టొచ్చు. నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 5.8 % లభిస్తుంది. ఇలా 27 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మనకు రూ.99 లక్షలు వస్తాయి. ఇలా చాలా స్కీమ్ ప్లాన్లు ఉన్నాయి. ఒక సారి పోస్టాఫీస్ కు వెళ్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీకు నచ్చిన ప్లాన్ ను ఎంచుకోవచ్చు.