Digital Payment App: ప్రస్తుతం చాలా మంది డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడుతున్నారు. ఇవే గనుక లేకుంటే పదే పదే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. టైం అంతా వేస్ట్.. ప్రస్తుతం చాలా మంది తమ ఆర్థిక లావాదేవీలను బ్యాంకుల వెళ్లి నిర్వహించడం లేదు. మొబైల్ పేమెంట్ యాప్స్ ద్వారా ఇతరులకు క్షణాల్లో నగదు పంపించడం లేదా పొందడం చేస్తున్నారు. దీని ద్వారా కస్టమర్లకే కాకుండా బ్యాంకులకు కూడా శ్రమ తగ్గిందని చెప్పుకోవచ్చు. డిజిటల్ పేమెంట్ యాప్స్ వచ్చాక చాలా మంది ఏటీఎం, బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేయడమే మానేశారు. దీంతో బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద రద్దీ తగ్గింది. సింగిల్ క్లిక్తో రూ.లక్షలోపు వరకు విడతల వారీగా నగదు లావాదేవీలు జరుపుతున్నారు. ఇలాంటి ట్రాన్సాక్షన్స్కు ‘గూగుల్ పే’ను జనాలు ప్రధానంగా వినియోగిస్తున్నారు.
వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్స్..
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ప్రతీఏటా కొత్త రూల్స్ను తీసుకొస్తుంది. ఇవన్నీ ఆర్థిక రంగంపై ప్రభావం చూపుతాయి. అనగా ఆర్థిక పురోగాభివృద్ధి కోసం,భద్రత పరమైన చర్యలకు కూడా ఆర్బీఐ చర్యలు చేపడుతుంది. రిజర్వు బ్యాంక్ తీసుకునే నిర్ణయాలు దేశంలోని అన్ని ప్రైవేటు, పబ్లిక్ రంగ బ్యాంకులు, వాటిపై ఆధారపడి పని చేసే నెట్వర్క్పై తప్పకుండా ప్రభావం చూపుతాయి. దీంతో అవి కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ను తప్పకుండా పాటిస్తూ మార్పులు, చేర్పులకు జై కొట్టాల్సిందే. తాజాగా ఆర్బీఐ తీసుకున్న ఓ నిర్ణయంతో గూగుల్ పేలో కొన్ని మార్పులు రానున్నాయి.ఈ విషయం పట్ల కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
నో సేవ్ ఆప్షన్.. జనవరి 1నుంచి అమల్లోకి..
ఇది వరకు గూగుల్ పేలో మన డెబిట్ లేదా కార్డు నెంబర్, వాటి ఎక్స్పైరీ తేదీ వివరాలు అందులో స్టోర్ అయి ఉండేవి. ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం యాప్ నుంచి ఈ డిటేయిల్స్ డిలీట్ అవుతాయి. నెల నెలా సబ్స్క్రిప్షన్ పేమెంట్స్ కోసం గూగుల్ పేలో చాలా మంది యూజర్లు వారి కార్డు వివరాలను సేవ్ చేసుకొని ఉంటారు. 2022 జనవరి 1 నుంచి అవి తొలగించబడతాయి. కార్డు జారీచేసే సంస్థలు, కార్డు నెట్వర్క్ కంపెనీలు మినహా వ్యాపారులు, ఇతర సంస్థలు, కస్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోడానికి వీల్లేదు. దీని ప్రకారం మళ్లీ కొత్తగా కార్డు డిటేయిల్స్ ఎంటర్ చేసి లావాదేవీలు జరపాలి. ఇండియాలో ఎకనమిక్ ఫ్రాడ్ ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లకు బెనిఫిట్ చేసేలా ఆర్బీఐ ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.