తెలంగాణలో ఉత్కంఠను రేకెత్తిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 1వ తేదీన జరగనుండగా… ఇప్పటికే అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ఎన్నికల ప్రచారంలో కీలక పరిణామం నేడు చోటు చేసుకోనుంది. అదే నేటితో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటం. గ్రేటర్ ఎన్నికల ప్రచారం 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది . దీంతో హైదరాబాద్ వాసులకు ప్రశాంతత దొరకనుంది.
హోరెత్తిన ప్రచారం
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. వివిధ పార్టీలు తమదైన శైలిలో ప్రజలకు చేరువ అయ్యాయి. అనేక రకాలైన ఎత్తుగడలు వేశాయి. మైకులతో మోత మోగించాయి. అలా హైదరాబాద్ ప్రజలు విసుగు చెందిన సమయంలో నేటితో ప్రచార పర్వానికి కూడా తెరపడనుంది. ఈసీ దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించని రాజకీపార్టీల నేతలు, అభ్యర్ధుల, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఈసీ కార్యదర్శి అశోక్కుమార్ ఈ మేరకు హెచ్చరించారు.
రెండేళ్ల జైలు శిక్ష
వచ్చే 48గంటల్లో ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు, అభ్యర్ధులు ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6గంటలకు ముగించాలని తెలిపిన కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఈసీ నిబంధనలు పాటించనివారిపై జీహెచ్ఎంసీ యాక్ట్, 1955 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజలకు ఈ రోజు నుంచి ప్రచారం నుంచి విముక్తి దొరికి ప్రశాంతత దక్కనుంది. అదే సమయంలో వారి విలువైన ఓటు వేసేందుకు ఆలోచించుకునే అవకాశం కూడా దొరకనుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?