సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. షూటింగ్ మొదలయ్యాక 40 శాతం చిత్రీకరణ జరిపిన చిత్ర యూనిట్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిపివేశారు. అంతే ఇక అప్పటి నుచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మళ్ళీ మొదలవుతుందా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత నెల నుంచి మిగతా సినిమాలన్ని సెట్స్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ రాధే శ్యామ్ బృదం అయితే ఏకంగా దేశాలే దాటి వెళ్ళింది. కాని ఆచార్య సినిమా మొదలవలేదన్న టాక్ వినిపించింది. కాగా ఎట్టకేలకి దాదాపు 8 నెలల తర్వాత మళ్ళీ ఆచార్య సెట్స్ మీదకి రానుందని సమాచారం. నవంబర్ నుంచి షెడ్యూల్స్ ప్లాన్ చేశారట ఆచార్య టీమ్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెజీనా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఇక ఇప్పటికే ఆచార్య ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఈ క్రమంలోనే ఫిబ్రవరి వరకు టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక చరణ్ కు జంటగా రష్మిక మందన్న కూడా నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కాగా దాదాపు 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మెగాస్టార్ సినిమాకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం విశేషం. ఇప్పటికే మణిశర్మ 5 పాటలని రెడీ చేశారు.