పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఆయన అభిమానులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆయన రాజకీయ ప్రవేశం ప్రకటన విన్నాక ఆయన ఫ్యాన్స్ పవన్ ని స్క్రీన్ మీద చాలా మిస్ అయ్యారు. కానీ వచ్చే ఎన్నికల వరకు సినిమాలలో నటిస్తాడు అన్న వార్త విన్నాక పండగ చేసుకున్నారు. బాలీవుడ్ సినిమా ‘పింక్’ రీమేక్ లో అయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకేముంది త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవుతది అనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ వలన లాక్ డౌన్ విధించారు. ఇంక ఎప్పుడో రిలీజ్ అవ్వాలిసిన వకీల్ సాబ్ సినిమా ఇప్పటి వరకు రాలేదు.
తాజాగా వకీల్ సాబ్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త ను ప్రకటించారు. వకీల్ సాబ్ సినిమా టీజర్ ను ఈ న్యూ ఇయర్ కి కానుకగా సినిమా నిర్మాతలు విడుదల చేయనున్నారు. నిజానికి ఈ టీజర్ దసరాకు విడుదల కావలిసినది కానీ కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై రూపొందుతుంది. లాక్ డౌన్ ను సడలించినందున ఈ మధ్యే వకీల్ సాబ్ షూటింగ్ మళ్లీ పట్టాలెక్కింది. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్కి ముందే దాదాపు 80 శాతం పూర్తయింది. కేవలం కొన్ని రోజుల పార్ట్ మాత్రమే మిగిలిపోయింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు మారియు బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిర్మాతలు 2021 మార్చిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పవన్ కచ్చితంగా అదిరిపోయే రీ ఎంట్రీ ఇస్తాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.