దేశ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా కేజీఎఫ్… అయితే కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ల కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇటీవల ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఏకంగా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు కేజీఎఫ్ నిర్మాతలు. ‘సలార్’ అనే టైటిల్ ను ఈ సినిమాకి ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ప్రభాస్ తదుపరి చిత్రం సలార్ సినిమా గురించి సౌత్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. ఈ సినిమాను దాదాపుగా 150 కోట్లతో నిర్మించనున్నట్లు కెజియఫ్ ఫేమ్ హోంబళే క్రియేషన్స్ స్పష్టం చేసింది. కేజిఫ్ 2 సినిమా తరువాత వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా షూట్ మొదలవ్వనున్నది. ప్రభాస్ కు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్నందున ఈ సినిమా ను దేశ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించనున్నారు.
ఇందులో నటించడానికి ప్రభాస్ భారీ పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా క్యాస్టింగ్ లో అన్ని భాషలకు సంబంధించిన నటులు ఇందులో నటించబోతున్నారు. ఈ నెలాఖరుకి ప్రభాస్ తన ప్రస్తుతం సినిమా ‘రాధేశ్యామ్’ మూవీ షూట్ ను పూర్తి పూర్తిచేసుకోనున్నాడు.
ఇటీవల వచ్చిన కథనాల ప్రకారం ప్రశాంత్ నీల్ కెజిఫ్ 2 సినిమా తరువాత ‘భగీర’ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నట్లు తెలుస్తుంది. దీనితో ప్రభాస్ ఫాన్స్ అయోమయంలో పడ్డారు. ఈ విషయం పై నేరుగా ప్రశాంత్ నీల్ స్పందిస్తూ తాను కెజిఫ్ 2 సినిమా తరువాత ప్రభాస్ ‘సలార్’ ను డైరెక్ట్ చెయ్యబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కన్నడ యాక్టర్ శ్రీ మురళి నటించనున్న ‘భగీర’ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడం లేదని కేవలం కథను మాత్రమే అందిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.