TTD: తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి భక్తులకు ఒక శుభవార్తను అందించింది. కరోనా కారణంగా శ్రీవారిని దర్శించుకోనే భాగ్యాన్ని చాలా మంది మిస్ అయ్యారు. భక్తుల సంఖ్య పెరిగితే కరోనా వ్యాప్తి అధికం అవుతుందని టీటీడి భావించి గత 6 నెలల నుంచి శ్రీవారి సర్వదర్శనాలను టీటీడీ నిలిపివేసిన సంగతి అందరికి తెలిసిందే. కేవలం రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్లు, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను మాత్రమే ఇప్పటిదాకా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తూ వస్తున్నారు తిరుమల దేవస్థానం వారు.
Sonu Sood: నేడు ఏపికి సోనూ సూద్ రాక..! ఎందుకంటే..?
ఈ క్రమంలోనే టీటీడీ ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంది. అదేంటంటే తిరుమలలో సర్వ దర్శనాలకు అంటే ఉచిత దర్శనంకు భక్తులను అనుమతించనున్నామని ఒక కీలక ప్రకటనను జారీ చేసింది టీటీడీ. సెప్టెంబర్ 8వ తేదీ రోజున ఉదయం 6 గంటల నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు 2 వేల టోకెన్లను మాత్రమే జారీ చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయితే ఈ సదవకాశం అన్ని జిల్లాల వారికి వర్తించదట. ఇప్పుడు కేవలం చిత్తూరు జిల్లా నివాసితులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లను ఇవ్వనున్నారట.
Prakash raj: ప్రకాష్ రాజ్ని జగపతి బాబు, విజయ్ సేతుపతి డామినేట్ చేస్తున్నారా..అందుకే గతకొంతకాలంగా అవకాశాలు తగ్గాయా..?
అయితే రానున్న రోజుల్లో మిగతా జిల్లాల వారికి కూడా సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని గతంలో మాదిరి రోజూకు 8 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేయకుండా పరిమిత సంఖ్యలో అంటే రోజుకు 2 వేల చొప్పున మాత్రమే సర్వదర్శనం టోకెన్లను ఇస్తున్నారు. మరింత సమాచారం కావాలన్నగాని, టికెట్స్ గురించి తెలుసుకోవాలన్నా గాని tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో గల గోవిందా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.