Banking news: కరోనా సమయంలో కస్టమర్లకు రిస్క్ తగ్గించేందుకు బ్యాంకింగ్ సంస్థలు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇంటి వద్ద నుంచే అన్ని చెల్లింపులు జరిపేలా సరికొత్త మెరుగైన సేవలను పరిచయం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక బ్యాంకులు తమ కస్టమర్లకు బాగా యూజ్ అయ్యే సేవలు తెచ్చి ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక బ్యాంకు ఇంటినుంచే కస్టమ్ డ్యూటీ చెల్లించే వెసులుబాటు తీసుకొచ్చింది. ఆ బ్యాంకు, దాని సరికొత్త సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Sukumar: పుష్ప 2 కంటే ముందు సుకుమార్ చెయ్యబోతున్న బిగ్ డీల్ ఇదే..
Banking news: కరూర్ వైశ్యా బ్యాంక్
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన కరూర్ వైశ్యా బ్యాంక్ కస్టమర్లు ఇంటి వద్ద నుంచే కస్టమ్ డ్యూటీ పే చేయొచ్చని వెల్లడించింది. తమ బ్యాంకు అకౌంట్ హోల్డర్లు ఐసీఈజీఏటీఈ ప్లాట్పామ్ ద్వారా డైరెక్ట్ గా కస్టమ్ డ్యూటీ పేమెంట్స్ చేయవచ్చని కరూర్ వైశ్యా బ్యాంక్ కస్టమర్లకు వివరించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సంస్థ.. కరూర్ బ్యాంక్కు పన్ను వసూళ్లకు సంబంధించి ఇటీవలే అనుమతులు జారీ చేసింది. ఆ తరువాత కరూర్ బ్యాంక్ కస్టమ్ డ్యూటీని నేరుగా పేమెంట్ చేసుకోవచ్చని తన ఖాతాదారులందరికీ తెలిపింది. దీనితో ఇప్పుడు ఈ బ్యాంకు ఖాతాదారులు ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్వే (ఐసీఈజీఏటీఈ) పోర్టల్ వేదికగా తాము కట్టాల్సిన కస్టమ్ డ్యూటీని చాలా సులభంగా చెల్లించుకోవచ్చు. ప్రస్తుత ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ తరహా సేవలు తీసుకురావడం కస్టమర్లకు పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు.
Nandamuri Balakrishna: పాకిస్థాన్లో అఖండ..!!
కస్టమ్స్ డ్యూటీ ఎలా చెల్లించాలి
ఐసీఈజీఏటీఈ పోర్టల్ లో కరూర్ బ్యాంక్ కస్టమర్లు కేవీబీ ఆప్షన్ సెలెక్ట్ చేసి కస్టమ్స్ డ్యూటీ పే చేయవచ్చు. కస్టమ్స్ డ్యూటీ అనేది విదేశాల నుంచి ఇండియాలోకి రవాణా అయ్యే ఎగుమతులు, దిగుమతులపై విధించే పన్ను అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కరూర్ వైశ్యా బ్యాంకు తన ఖాతాదారుల్లో కస్టమ్ హౌస్ బ్రోకర్స్, సీఎఫ్ఎస్లు, ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్, షిపింగ్ లైన్ ఏజెంట్లు ఐసీడీలు… ఇలా చాలామంది డిజిటల్ పద్ధతిలో ఆన్లైన్ పోర్టల్లో కస్టమ్స్ డ్యూటీ పే చేసేందుకు అనుమతిస్తుంది.