రైలు ప్రయాణం సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది.. అతి చవక చార్జీలతో ప్రయాణాన్ని అందించడంతో పాటు ప్రతి స్టేషన్లలో ఆగుతుంది.. మీరు తరచూ ట్రైన్ లో వెళ్తూంటారా..? ఈసారి ట్రైన్ ఎక్కినప్పుడు లోయర్ బెర్త్ పై ఓ లుక్కేయండి..! ఆన్లైన్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎక్కువగా అప్పర్, మిడిల్ బెర్త్ లనే ఎంచుకుంటాము.. లోయర్ బెర్త్ జోలికి ఎవ్వరు వెళ్ళనే వెళ్లరు.. ఒకవేళ ఎంచుకోవాల్సి వచ్చినా తప్పక బుక్ చేసుకుంటారు.. ఈ విషయాన్ని గమనించిన భారతీయరైల్వే ప్రయాణికుల ప్రయాణం మరింత సౌకర్యవంతం చేయుటకు లోయర్ బెర్త్ రూపురేఖల్ని మార్చేసింది..!
సాధారణంగా రైల్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఏ బెర్త్ వచ్చినా అడ్జస్ట్ అవుతాం. అయితే లోయర్ సైడ్ బెర్త్ వస్తే మాత్రం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు కానీ అందులో కూర్చోవడానికి మాత్రం ఇష్టపడం. ప్రయాణికుల అసౌకర్యాన్ని గుర్తించిన రైల్వే శాఖ. లోయర్ సైడ్ బెర్త్ లో మధ్యలో ఎటువంటి సపోర్ట్ ఉండదు. అందువలన ఈ బెడ్ పైన పడుకునే ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు లోయర్ సైడ్ కు అదనంగా మరో సపోర్ట్ ఏర్పాటు చేసింది. అంటే లోయర్ సైడ్ బెర్త్ చైర్లు ఫోల్డ్ చేసి బెడ్ గా మార్చిన తరువాత పైన సపోర్ట్ గా ఉండేందుకు మరో పలకను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది.
ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుందని, అందుకు ఇదే ఉదాహరణ అని, ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం సీట్లలో మార్పులు చేశామని,
అది ఎలా ఉంటుందో తెలిపే వీడియో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.