బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మరియు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ మెుదటి బిడ్డ కోసం అత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీరు జుహు అపార్ట్మెంట్లో కొత్తగా ఒక ఇంటిని నిర్మించుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారు నిర్మించుకుంటున్న తమ ఇంటిని సందర్శించారు. అంతకంటే ముందుగా వీరు డాక్టర్ దగ్గరికి చెక్అప్ కి వెళ్లి అక్కడ బేబి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తర్వాత జుహు లో తమ కొత్త ఇంటి నిర్మాణాన్ని చూడడానికి వెళ్ళారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వెలువడిన కథనాల ప్రకారం “అనుష్క మరియు విరాట్ హాస్పిటల్ లో డాక్టర్ ని కలిసాక జుహులో నిర్మిస్తున్న తమ ఇంటిని సందర్శించడానికి వెళ్ళారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనానికి ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ కొత్త అపార్ట్మెంట్లోకి అనుష్క మరియు విరాట్ లు ఎప్పుడు మారుతారనే దానిపై ఇంకా సమాచారం లేదు ” అని పేర్కొంది.
వారు క్లినిక్ను సందర్శించిన సమయంలో తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ వైరల్గా మారాయి. నిండు గర్భీణిగా ఉన్న అనుష్క వైట్ ఆండ్ బ్లాక్ డ్రెస్ లో కనిపించారు. ఇటీవల, వోగ్ ఇండియా పత్రిక ఫ్రంట్ పేజీ లో కూడా అనుష్క కనిపించారు. బేబీ-బంప్తో ఫోజులు ఇస్తూ అనుష్క మ్యాగాజీన్ కవర్ పేజీపై కనిపించారు. ఆమె ఆ చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
మరో కొద్ది రోజుల్లో అనుష్క పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. మొదటి నుంచి తన ప్రెగ్నన్సీ ని చాలా ఎంజాయ్ చేస్తు ఎప్పటికప్పుడూ తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?