“రాజధాని అన్న దానికి సరైన నిర్వచనం ఏదీ లేదు.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని” అని అసెంబ్లీ సాక్షిగా జగన్ రాజధానిపై వివరణ ఇచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది! సరిగ్గా ఈ పాయింట్ ను పట్టుకునే.. తాను కనుక విశాఖ వెళ్ళిపోతే టెక్నికల్ గా అదే రాజధాని అవుతుంది అని జగన్ ఫిక్సయ్యారంట! అందులో భాగంగానే కొన్ని ఆలోచనలు చేశారని.. ఆ మేరకు ఇప్పటికే కొన్ని పనులు చక్కబెట్టారని తెలుస్తోంది.
కష్టాల్లో ఉన్న వైజాక్ కు.. వరుస ప్రమాధాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్కునగరానికి.. ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి! ఎందుకంటే… జగన్ తన పాలనా కార్యక్రమాలు ఇకపై విశాఖ నుంచి నిర్వహించాలని ఫిక్సయ్యారంట! అవును… ప్రస్తుతానికి ఆషాడం, మంచి రోజులేవీ లేకపోవడంతో… శ్రావణం రాగానే ముందుగా తానే విశాఖకు వస్తారని తెలుస్తోంది! రాజధాని షిప్టింగ్ అంటే దానికి సవాలక్ష సమస్యలు ఉంటాయి కాబట్టి.. ప్రస్తుతానికి సీఎం ఆఫీస్ ని మాత్రం విశాఖకు తరలించ నిర్ణయించారని తెలుస్తోంది.
ఏపీలోని మొత్తం పాలనావ్యవహారాలు అన్నీ కూడా సీఎం కనుసన్నలలోనే సాగుతాయి కాబట్టి.. సీఎం ఆఫీస్ వచ్చేసింది అంటే మిగిలినవి ఆటోమెటిక్ గా వచ్చి చేరిపోవాలి.. చేరిపోతాయి! ఈ క్రమంలో… ముందుగా ముఖ్యమంత్రి వరకూ విశాఖ రావడం అంటే పెద్దగా ఇబ్బందులు ఉండవని, జగన్ ఎపుడు అనుకుంటే అప్పుడు ఉక్కునగరానికి పయనమైపోవచ్చని అంటున్నారు.
ఆ సంగతులు అలా ఉంటే… సీఎం క్యాంప్ ఆఫీస్ కనుక విశాఖకు తరలివస్తే మొత్తం రాజధాని వచ్చేసినట్లే లెక్క! మరి సచివాలయం సంగతి? ఇప్పటికే సచివాలయం సిబ్బంది సగం మంది గుంటూరు విజయవాడల్లోనే ఉంటుంటే… సగంమంది ఇప్పటికీ హైదరాబాద్ టు అమరావతి సెటిల్ సర్వీస్ ఉ చేస్తున్నారు. మరి ఆ సంగతిపై న్యాయస్థానలు ఉన్నాయనుకోండి.. కాస్త టైం పట్టే యవ్వారం కావొచ్చు! కానీ… ప్రస్తుతానికి సీఎం అయితే విశాఖకు వచ్చేస్తున్నారు!!