ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కి మందు రెడీ అయిపోయింది. ముంబాయి రాష్ట్రానికి చెందిన భారతీయ ఫార్మా దిగ్గజం కంపెనీ గ్లేన్ మార్క్ ఆధ్వర్యంలో వచ్చిన ఫాబిఫ్లూ టాబ్లెట్ కు డ్రగ్ కంట్రలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం భారత దేశంలో కరోనా వ్యాప్తి ఉదృతంగా కొనసాగుతున్న తరుణంలో గ్లేన్ మార్క్ కంపెనీ ఈ వార్త చెప్పడంతో దేశ ప్రజలంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కరోనా నియంత్రణకు నోటితో తీసుకునే మొదటి మెడిసిన్ గా ఫాబిఫ్లూ టాబ్లెట్ రూపొందించింది గ్లేన్ మార్క్. కరోనా తక్కువ మరియు మధ్య స్థాయి లక్షణాలు ఉన్న వారే వాడాలని కంపెనీ సూచించింది.
ఫాబిఫ్లూ పేరుతో రెండు వందల మిల్లీ గ్రాములు కలిగిన ఈ టాబ్లెట్ మార్కెట్ లో ఈరోజు నుండే 103 రూపాయలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చేసింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా తొందరలో ఈ మెడిసిన్ అందరికీ అందుబాటులోకి వీలైనంత త్వరగా తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు గ్లేన్ మార్క్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దన్హా తెలిపారు. ఈ డ్రగ్ తక్కువ మరియు మధ్యస్థ కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఫ్లూ డ్రగ్ స్థితిగతుల్ని అంచనా వేస్తూ కరోనా వ్యాప్తిని తగ్గిస్తుందని కొద్దిరోజుల్లోనే దేశంలో అన్ని చోట్ల అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు .