Breaking: ఏపీ రాష్ట్రంలో పాఠశాలలకు ఒంటిపూట బడులు డేట్ వచ్చేసింది. ఈ మేరకు శుక్రవారం అనగా ఈరోజు ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయని తెలిపారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని, విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆమధ్య తీవ్ర ఎండలో ఒంటిపూట బడుల పేరుతో పిల్లలను ఇళ్లకు పంపడం సబబు కాదంటూ పలువురు విద్యాధికారులు తమ అభిప్రాయం తెలిపిన సంగతి తెలిసినదే.
Breaking: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డిక్కీలో భారీగా నోట్ల కట్టలు పట్టివేత ..మొత్తం ఎన్ని లక్షలు అంటే..?
ఇకపోతే తాజాగా ఈ నిర్ణయం రావడం పట్ల పలువురు ఉపాధాయ్యులు, విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పాఠశాల సమయాల విషయానికొస్తే, ఉదయం 7:30 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ 27 నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నట్లు మంత్రి సురేష్ ఈ సందర్భంగా తెలిపారు.