IT employees: కరోనా కష్టకాలం తరువాత, మరీ ముఖ్యంగా ఈ IT ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం చిక్కింది. దాంతో ఇంటినుండి వారు తమ విధులు నిర్వహిస్తూ తమ కుటుంబానికి దగ్గరగా జీవించేవారు. ఇదివరకైతే వారు తమ సమయాన్ని ప్రయాణం కోసమే దాదాపు గంట నుంచి 3 గంటల వరకు వెచ్చించేవారు. అలాంటివారికి కరోనా హెల్ప్ చేసిందనే చెప్పాలి. దాదాపుగా ఏడాదిన్నరకు పైనే ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగుల్ని.. ఈ మధ్యనే ఆఫీసులకు వచ్చి పని చేయాలని చాలా కంపెనీలు ఆదేశిస్తున్నాయి.
Ginger Oil: ఈ నూనె తో జలుబు నుంచి క్యాన్సర్ వరకు అన్నింటినీ నయం చేస్తుంది..!!
ప్రస్తుత IT కంపెనీల పరిస్థితి ఏమిటి?
2022 జనవరి నుంచి పక్కాగా ఆఫీసులకు వచ్చి పని చేయాలని వివిధ కంపెనీలు గతంలో డిమాండ్ చేసాయి. కట్ చేస్తే, కరోనా మరో రూపం దాల్చి ఒమిక్రాన్ రూపంలో ఇపుడు ప్రజలను బాధిస్తోంది. దాంతో కొన్ని కంపెనీలు 2022 మధ్య వరకు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని ప్రటించేసాయి. మరికొన్ని కంపెనీలు వచ్చే ఏడాది మొత్తం తమ ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయమని చెప్పేశాయి. ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం రెండు వ్యాక్సినేషన్ల డోసులు పూర్తి చేసుకున్నాయి.
Diabetes: మధుమేహం ఉన్నవారు వంకాయ తినొచ్చా..!?
IT ఉద్యోగుల స్పందన ఏమిటి?
IT ఉద్యోగులు ఈ విషయమై రకరకాలుగా స్పందిస్తున్నారు. వారిలో భిన్నాభిప్రాయాలు వున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితిలో దాదాపు అందరు కూడా ఇంటినుండే వర్క్ చేయడానికి జెండా ఊపుతున్నారు. ఓ పక్క కరోనా భయం వారిని వెంటాడుతోంది మరి. ఇంకొంతమందికి ఈ విధానం ద్వారా సోషల్ లైఫ్ దొరుకుతోంది కనుక వారు శాశ్వతంగా ఇంటినుండే వర్క్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇకపోతే కరోనా వ్యాప్తి దృష్ట్యా చాలా మంది విద్యార్థులకు మాత్రం తీవ్ర నష్టం జరిగింది. వారు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.