TTD: భక్తులకు TTD సువర్ణావకాశం కల్పిస్తోంది. అయితే ఈ అవకాశం ఓన్లీ లోకల్స్ కోసమే సుమా! విషయంలోకి వెళితే, వైకుంఠ ఏకాదశి వేళ సుమారు 10 రోజులు పాటు రోజుకు 5 వేల ఆఫ్ లైన్ టికెట్లు చొప్పున స్థానికులకు కేటాయించామని, సదరు అవకాశాన్ని లోకల్స్ అందరూ వినియోగించుకోవాలని TTD అదనపు EO ధర్మారెడ్డి తాజాగా మీడియాతో తెలిపారు. తిరుపతికి చెందిన భక్తులు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అని అన్నారు. ఈ సారి వైకుంఠ ద్వార దర్శనం ఓ పది రోజుల కొనసాగనుందని ధర్మారెడ్డి తెలిపారు.
Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి..!? ఎలా చేయాలి..!?
ఎప్పటినుండి ఎప్పటి వరకు ఈ దర్శనం కలుగును?
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చేసంవత్సరం జనవరి 13 – 22 వరకు మాత్రమే ఈ వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కలదు. ఇకపోతే ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోడానికి లక్షలాదిగా భక్తులు తొండోపతండలుగా తరలివస్తారు. ఏకాదశి, ద్వాదశి ఈ రెండు రోజులే వైకుంఠ ద్వారం తెరిచి ఉండటం వల్ల ఎక్కువ మందికి ఈ ద్వార దర్శనం లభించడం లేదు. అందుకే టీడీడీ ఈసారి వైకుంఠద్వారం ఓ 10 రోజుల పాటు తెరిచి ఉంచనుంది. కనుక భక్తులు ఈ అవకాశాన్ని మిస్ కావద్దు.
RRR: చరణ్, ఎన్టీఆర్ లలో ఎవరు గుడ్ బాయ్ అనేది చెప్పేసిన రాజమౌళి..!!
అలాగే భక్తులకు TTD అలెర్ట్!
తాజాగా TTD మరో కీలక ప్రకటన విడుదల చేసింది. అదేమంటే, వచ్చే ఏడాది అనగా.. జనవరి 11వ తేదీ నుంచి 14 తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కనుక భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనలో చాలామందికి ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటో తెలియదు. అంటే, దక్షిణాయనం ప్రారంభం ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు.