Goodachari : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరో అని పేరు తెచ్చుకున్న నటుడు అడవి శేష్. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. అయితే ‘క్షణం’ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు అడవి శేష్ కి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత ‘అమీ తుమీ’, ‘గూఢచారి’ ‘ఎవరు’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అంతే కాదు ఈ సినిమా తర్వాత ఆయనకి టాలీవుడ్ లో బాగా క్రేజ్ పెరిగింది.
ఈ నాలుగు సినిమాలు వేటికవే వినూత్నంగా తెరకెక్కడంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా 2018లో స్పై థ్రిల్లర్ కథాంశంతో వచ్చి భారీ హిట్ అందుకున్న ‘గూఢచారి’ మూవీ అడవి శేష్ కెరీర్ లోనే ప్రత్యేకమైన సినిమాగా మిగిలింది. తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ సాధించింది. ఈ సినిమాతో శశి కిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయమయ్యాడు. దర్శకుడిగా ఆయనకి మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాకి అడవి శేష్ కథ – స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
Goodachari : మేజర్ సినిమా పూర్తి కాగానే ‘గూఢచారి 2’ సెట్స్ మీదకి
ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, వెన్నెల కిషోర్ మిగతా ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆగస్ట్ 3కి సరిగా మూడేళ్లు అయింది. ఈ సందర్భంగా హీరో అడవి శేష్.. దర్శక, నిర్మాతలు ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ‘గూఢచారి 2’ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ని కూడా ఇచ్చారు. త్వరలో ‘గూఢచారి 2’ మొదలవనుందని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం చేస్తున్న మేజర్ సినిమా పూర్తి కాగానే ‘గూఢచారి 2’ సెట్స్ మీదకి తీసుకు వస్తానని అడవి శేష్ ట్వీట్ లో తెలిపాడు.