Online Payments: ఆన్ లైన్ పేమెంట్స్. ఈ పేరు ప్రస్తుతం దేశంలో మార్మోగిపోతుంది. రోజురోజుకూ ఆన్ లైన్ పేమెంట్లు చేసే వారి సంఖ్య పెరుక్కుంటూ పోతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉండడంతో డిజిటల్ చెల్లింపులకే మొగ్గు చూపిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేని వారు కూడా.. ఇతర మార్గాల ద్వారా ఆన్ లైన్ లోనే చెల్లింపులను పూర్తి చేస్తున్నారు. ఇలా ఆన్ లైన్ లో చెల్లింపులు పూర్తి చేయడం వలన సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొంటున్నారు. ఇలా ఆన్ లైన్ పేమెంట్లను గూగుల్ లో కూడా చాలా మంది చేస్తారు. కానీ ఇప్పుడు అటువంటి వారికి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది.
ఆకర్షణీయ ఆఫర్లు…
ఎక్కువ మంది ఆన్ లైన్ చెల్లింపులు చేసేందుకు మొగ్గు చూపేది ఆఫర్లను చూసి. పలు కంపెనీలు వివిధ రకాల క్రేజీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మన ఇండియాలో చాలా యాప్ లు ఇలా ఆన్ లైన్ చెల్లింపుల కోసం పుట్టుకొచ్చాయి. ఇలా ఆన్ లైన్ చెల్లింపులు చేయడం వలన సమయం సేవ్ అవడంతో పాటు అనేక బెనిఫిట్లు కూడా ఉంటున్నాయని చెబుతున్నారు. మరలా నోట్ల రద్దు వంటి షాకింగ్ నిర్ణయం తర్వాత డిజిటల్ పేమెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నోట్ల రద్దు సమయంలో వేరే ప్రత్యామ్నాయం లేక ఆన్ లైన్ పేమెంట్లు చేసిన జనం అందులో ఉన్న సులభమైన పద్ధతికి అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు గూగుల్ చేసిన ప్రకటన వలన అనేక మంది ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.
కేవలం వాటినే మాత్రమే సేవ్ చేస్తాం..
2022 జనవరి 1 నుంచి ఎటువంటి కార్డు వివరాలను సేవ్ చేసుకోబోమని దిగ్గజ సంస్థ గూగుల్ ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించే ఇలా చేస్తున్నట్లు తెలిపింది. వీసా, మాస్టర్ కార్డుల వివరాలను సేవ్ చేస్తామని కానీ అలా సేవ్ చేయాలంటే కార్డు వివరాలను ఈ నెల 31 లోపు మరోసారి ఎంటర్ చేయాలని తెలిపింది. ఇలా చెప్పడంతో ఆన్ లైన్ పేమెంట్లు చేసే వారు షాక్ కు గురవుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?