సామాజిక మాధ్యమాల రాజకీయ పక్షపాతంపై వివాదం కొనసాగుతున్న తరుణంలో వీటి పరిష్కారానికి పార్లమెంటరీ జాయింట్ కమిటీ చర్యలు చేపట్టింది. బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి లేఖి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులు హజరై వివరాలు వెల్లడిస్తున్నారు. నిన్న ఫేస్ బుక్, ట్విట్టర్, అమెజాన్ ప్రతినిధులు హజరై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు హజరుకాగా నేడు గూగుల్, పేటీఎం అధికారులు హజరయ్యారు.
2019 వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుఫై కాంగ్రెస్ చేసే ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని, కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది అని అలాగే వాటాదారుల పూర్తి సమాచారాన్ని మరియు అధికారులు మౌఖిక ఆధారాలు కమిటీ ముందు పెట్టాల్సి ఉంటుందని ఇదే సమావేశం యొక్క ముఖ్య ఉద్దెశం అని కమిటీ పేర్కొన్నది.
సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్ అధికారులు, ఫేస్బుక్ ఇండియా అధిపతి అజిత్ మోహన్ ప్యానెల్ ఎదుట నిన్న కమిటీ ముందు హాజరయ్యారు.
ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ అధికారులు కూడా హాజరై దాదాపు మూడున్నర గంటలు పాటు మాఖిక ఆధారాలు ఇచ్చారు. కమిటీ ముందు హజరుకావడానికి తొలుత అమెజాన్ విముఖత వ్యక్తం చేసింది. అయితే ఎంపి మీనాక్షి లేఖి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు కమిటీ ముందు హజరైయ్యారు.
గత ఏడాది పార్లమెంటులో ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఫేస్బుక్, గూగుల్ ఇతర సంస్థలను అనామక వ్యక్తిగత మరియు వ్యక్తిగతేతర డేటా కోసం అడగడానికి ప్రభుత్వానికి అధికారం ఉందని అన్నారు. కానీ వినియోగదారుల వ్యక్తిగత డేటాను ప్రభుత్వం యాక్సెస్ చేయడం గురించి కంపెనీల నుండి కొన్ని ఆందోళనలు ఉన్నాయి