గూగుల్ ప్లేస్టోర్ నుండి ఇప్పుడు పేటిఎంను తొలగించారు. గూగుల్ ప్లేస్టోర్ పాలసీలతో ఏకీభవించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ ఇటీవలే ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్ ను తమ ప్లేస్టోర్ లో అనుమతించబోమని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే పేటిఎం ను తొలగించినట్లు తెలుస్తోంది. పేటిఎం ఫస్ట్ గేమ్స్ పేరిట స్పోర్ట్స్ బెట్టింగ్ ను మొదలుపెట్టింది పేటిఎం. దీనికి సచిన్ టెండూల్కర్ ను బ్రాండ్ అంబాసడర్ గా కూడా నియమించుకుంది. ఐపీఎల్ మొదలవ్వడానికి ఒక్కరోజు ముందు ఇలా జరగడం పేటిఎం కు నిజంగా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. అయితే గూగుల్ తో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే తిరిగి ప్లేస్టోర్ లో అందుబాటులో ఉండే విధంగా చర్చలు సాగుతున్నాయని పేటిఎం తెలిపింది. అయితే పేటిఎం అనుబంధ సంస్థలైన పేటిఎం బిజినెస్, మనీ వంటి యాప్స్ ప్లేస్టోర్ లో అందుబాటులోనే ఉన్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?