ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్ లేనివాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. నేటి జనరేషన్ కు స్మార్ట్ ఫోన్ లేనిదే పూట గడవదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోనే. స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలు మన అరచేతిలో ఉన్నట్టే. అయితే.. స్మార్ట్ ఫోన్ ను అవసరానికి ఉపయోగించుకుంటే దాని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాల్సిందే. యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా.. ఫేస్ బుక్ లాగిన్ అవ్వాలన్నా.. ఇతర సోషల్ మీడియా సైట్లలోకి లాగిన్ అవ్వాలన్నా ఖచ్చితంగా మెయిల్ ఉండాలి. అయితే చాలామంది జీమెయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
అయితే.. ఈ జనరేషన్ లో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతోందో.. సైబర్ నేరాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ లో ఏం చేసినా చూసేస్తున్నారు. మెయిల్ అకౌంట్లను హాక్ చేస్తున్నారు. మెయిల్ అకౌంట్లను హాక్ చేసి సున్నితమైన సమాచారాన్ని సేకరించి ఆన్ లైన్ మోసాలు చేస్తున్నారు.
అందుకే.. సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే జీమెయిల్ అకౌంట్ ను సురక్షితంగా ఉంచుకోవాలి. జీమెయిల్ అకౌంట్ భద్రత కోసం 2 స్టెప్ వెరిఫికేషన్ ను సెట్ చేసుకోవాలి.
దాని కోసం ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి… గూగుల్ సెట్టింగ్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ అకౌంట్ ఆప్షన్ మీద టాప్ చేసి… 2 స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులో గెట్ స్టార్టెడ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని… జీమెయిల్ అకౌంట్ కు లాగిన్ అయి… తర్వాత ట్రై ఇట్ నవ్ అనే ఆప్షన్ పై టాప్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేయాలి.
అంతే.. 2 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిపోతుంది. అప్పటి నుంచి మీరు ఎక్కడైనా.. ఏ డివైజ్ నుంచైనా జీమెయిల్ అకౌంట్ లోకి లాగిన్ అయితే ఖచ్చితంగా ఓటీపీ వెరిఫికేషన్ చేశాకనే అకౌంట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.