“అఖండ” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రారంభంలో ఈ సినిమా దసరా పండుగ టైంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ మధ్యలో సినిమా యూనిట్ తో పాటు హీరో బాలకృష్ణకి కరోనా ఎటాక్ అవటంతో కొన్ని రోజులపాటు షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ మధ్య మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయింది. కర్నూలు జిల్లాలో కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద.. మౌర్య హోటల్ వద్ద కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో బాలయ్య అభిమానులు షూటింగ్ జరిగే ప్రాంతం వద్ద ఫుల్ సందడి చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో షూటింగ్ చూడటానికి వచ్చిన తన అభిమానులకి బాలయ్య బాబు ప్రత్యేకమైన భోజనాలు పెట్టడంతో పాటు… ఓ అభిమాని ఆహ్వానం మేరకు అతని ఇంటికి వెళ్లి బాలయ్య బాబు భోజనం చేయడం జరిగింది. “NBK 107” వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “జై బాలయ్య” అనే టైటిల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోలో బాలయ్య బాబుని చాలా పవర్ ఫుల్ పాత్రలో చూపిస్తున్నాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా ఫస్ట్ టైం నడుస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అఖండ సినిమా విడుదలైన తారీకు అనగా డిసెంబర్ రెండవ తారీకు ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. వరుస విజయాల మీద ఉన్న గోపీచంద్ మల్లినేని ఈ సినిమా చేస్తూ ఉండటంతో నందమూరి బాలయ్య బాబు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?