గోపీచంద్ రాశీఖన్నా తో కలిసి ఇప్పటికే రెండు సినిమాలు నటించారు. జిల్ అన్న సినిమాతో పాటు ఆక్సిజన్ సినిమాలో గోపీచంద్ .. రాశీఖన్నా తో రొమాన్స్ చేశాడు. ఈ రెండు సినిమాలలో జిల్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాని ఆక్సిజన్ మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. కాగా ప్రస్తుతం gopichand తమన్న కలిసి సీటీమార్ అన్న సినిమా చేస్తున్నారు. సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో gopichand, తమన్నా కోచ్ లుగా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా తర్వాత gopichand .. మారుతి దర్శకత్వంలో నటించబోతునట్టు రీసెంట్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ లో కాస్టింగ్ సెలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు maruthi గోపీచంద్ కి జంటగా బబ్లీ బ్యూటి రాశిఖన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని భావించాడట మారుతీ. maruthi గత చిత్రం ప్రతీరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అందుకే ఈ సినిమాలో కూడా rasikhanna ని తీసుకోవాలని ప్రపోజల్ పెట్టాడట. కానీ హీరో గోపీచంద్ ఈ సినిమాలో హీరోయిన్ గా రాశీఖన్నాని తీసుకునేందుకు ఒప్పుకోలేదని సమాచారం.
అందుకు కారణం ప్రస్తుతం rasikhanna ఫాం లో లేకపోవడమే అన్న మాట వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో రాశీఖన్నా నటించిన సినిమాలలో వెంకీమామ, ప్రతీరోజూ పండుగే తప్ప మిగతా సినిమాలన్ని ఫ్లాప్ గా మిగిలాయి. gopichand కెరీర్ కూడా అంత ఆసక్తిగా సాగడం లేదు. అందుకే గోపీచంద్ ఈ ప్రాజెక్ట్ లో రాశీఖన్నా ని తీసుకోవాలనుకుంటే రిజెక్ట్ చేశాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది క్లారిటీ లేనప్పటికి ప్రస్తుతం రాశీఖన్నా కి తమిళంలో మాత్రం మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి.