విజయవాడ, జనవరి 25: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ దంపతులు శుక్రవారం కృష్ణాజిల్లాకు చేరుకున్నారు. నేడు, రేపు జరగనున్న కార్యక్రమాలో పాల్గొనేందుకు వారు వచ్చారు
గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ దంపతులకు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిఎడి ప్రొటోకాల్ అడిషనల్ సెక్రటరీ కర్నల్ అశోక్బాబు, జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తదితరులు స్వాగతం పలికారు.
గవర్నర్ ఈ రోజు సాయంత్రం జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల్లో, శనివారం జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారు.