అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టిన భారత ప్రభుత్వం దశల వారీగా అనుమతులు జారీ చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం అన్ లాక్ 3.0లో ఉన్న దేశం త్వరలో 4.0లోకి అడుగుపెట్టనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను భారత ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ ప్రక్రియలో భాగంగా మెట్రో సర్వీసులను తిరిగి మొదలుపెట్టుకునేందుకు అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్ 7 నుండి మెట్రో సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మెట్రో రైళ్లు ఆరు నెలల తర్వాత టెస్ట్ రన్ లో జరుపుకుంటున్నాయి. ఇక ఓపెన్ ఎయిర్ థియేటర్లను 21 సెప్టెంబర్ నుండి అనుమతులు జారీ చేసింది. ఇక స్కూళ్ల విషయంలోనూ మార్గదర్శకాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 21 నుండి 50 శాతం స్టాఫ్ స్కూల్స్ కు వెళ్లవచ్చని ప్రభుత్వం తెలిపింది. సినిమా హాల్స్ మరియు స్విమ్మింగ్ పూల్స్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంకా కఠినంగానే ఉంది.