హిందు సంప్రదాయాల్లో ఆవుకు ఉన్న ప్రముఖ్యత అంతా ఇంతా కాదు. దీని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆవు పాలు చాలా స్వచ్ఛమైనవి. వాటిని తాగితే కండబలంతో పాటు బుద్ధి బలం కూడా పెరుగుతుందని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. అలాగే పురాణాల్లో సైతం దీని గురించి ప్రస్థావన ఉంది. అందుకే కావొచ్చు మన పూర్వీకుల నుంచి ఆవును గోమాతగా పూజిస్తూ వస్తున్నారు. ఏవైనా పూజలు పునస్కారాలు జరిగితే.. ఈ గోమాత పాలు, పేడ మాత్రమే వాడుతారు.
అయితే గోమాతను రక్షించేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో గోశాలలను నడిపేవారిని ప్రోత్సహిస్తున్నాయి. ఆవుల పెంపకాలకు పాటు పడాలని పలువురిని కోరుతున్నాయి. కొందరు ప్రయివేట్ వ్యక్తులు సైతం ఈ పనిని సొంత పనిలా మార్చుకుని వాటి సంరక్షణకు పాటు పడుతున్నారు. వారు గోమాతను పూజిస్తే.. తల్లిని పూజించినట్టే అని పలువురికి తెలియజేస్తున్నారు.
అయితే ఇప్పుడు యూపీలోని కొందరు ఆఫీసర్లు గోమాత సంరక్షణకు నడుము బిగించారు. యూపీ లోని ఉన్నావ్ కు చిందిన ఆఫీసర్ల దీనికోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమంతో పలువురి నుంచి ప్రసంశలు పొందుతున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఆఫీసర్లు అందరికీ తెలిసేలా చేస్తున్నారు.
అయితే ఈ ఆఫీసర్లు చేసిన పని ఏంటంటే.. రైతులు ఒక ట్రాలీ ఆవు పేడ ఇస్తే రెండు ట్రాలీల ఎండు గడ్డి ఇస్తామని చెబుతున్నారు. ఇలా పశువుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆ ఆఫీసర్లు చెబుతున్నారు. దీనిపై గ్రామ గ్రామన తిరుగుతూ స్థానికులకు అవగాహన కలిగిస్తున్నారు. అలాగే పశువులను పెంచాలని సూచిస్తున్నారు.