అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి గ్రేటర్ రాయలసీమ నేతలు ఒక లేఖను రాశారు. పరిపాలనా వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. సీమకు న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమలో రాజధానిని పునరుద్ధరించాలని లేఖలో వారు కోరారు. గతంలో ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలు తెలుగు వారి ఐక్యత కోసం త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిపాలనా వికేంద్రీకరణలో రాయలసీమకు న్యాయం జరగాలన్నది తమ ఆకాంక్షగా పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచన హర్షనీయమని తెలిపారు.
ఈ లేఖపై గ్రేటర్ రాయలసీమ నేతలు మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, శైలజానాధ్, చెంగారెడ్డి, మాజీ డిజిపిలు అంజనేయరెడ్డి, దినేష్ రెడ్డి తదితరులు సంతకాలు చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?