రోడ్లు సరిగ్గా లేకపోతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాలలో భారతదేశం కూడా ఒకటి.ఒక దేశం అభివృద్ధి చెందిందనటానికి సంకేతం.. ఆ దేశంలో రోడ్లు , రవాణా వ్యవస్థ బాగా వృద్ధి చెందడం కూడా ఒక భాగమే.. ఈ నేపథ్యంలో మన దేశ రోడ్లును విస్తరించి అభివృద్ధి చేసే కార్యక్రమాలకు అధికారులు శ్రీకారం చుట్టారు.. మన దేశంలోని ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ ,హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో గ్రీన్ హైవే కారిడార్ల నిర్మాణానికి 500 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట ను రూపొందించారు.. ఈ ప్రాజెక్టుపై ఇండియా, ప్రపంచ బ్యాంకు అధికారులు సంతకాలు కూడా చేశారు..
ఈ ప్రాజెక్టులో గ్రీన్ టెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ టెక్నాలజీ లను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయిన గ్రీన్ హౌస్ వాయువులు కూడా గ్రీన్ టెక్నాలజీ సాయంతో తగ్గించవచ్చు.గ్రీన్ టెక్నాలజీ సాయంతో నిర్మాణ వ్యయాన్ని కూడా తగ్గించవచ్చు. ఈ ప్రాజెక్ట్ వలన నాలుగు రాష్ట్రాల్లోని రహదారి వినియోగదారులకు సమర్థవంతమైన రవాణాను అందిస్తుంది. అంతేకాకుండా నిర్మాణ వస్తువులు, నీటిని సమర్థవంతంగా ప్రజలకు అందజేసేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడుతాయి.
రోడ్డు రవాణా వ్యవస్థలో భారతీయ జాతీయ రహదారులు 40శాతం మాత్రమే ఉన్నాయి. వీటికి తగినంత సామర్థ్యం లేవు. వీటి నిర్మాణాలలో అవకతవకలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఉన్న రోడ్ల నిర్మాణాలను మరింత అభివృద్ధి చేయనుంది. ఇంకా కొత్త పెవ్మెంట్ల నిర్మాణం, డ్రైనేజీ సౌకర్యాలు, బైపాస్, జంక్షన్ వంటి సౌకర్యాలపై కేంద్రం దృష్టి సారించింది. 2022 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల జాతీయ రహదారులు 100% ప్లాంటేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని జాతీయ రహదారుల అధారిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్లాంటేషన్ పర్యవేక్షణ కోసం’ గ్రీన్ పాత్’ మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించింది. చెట్ల పెంపకానికి జనపనార, పత్తి వంటి చెట్లను రహదారిపై పెంచనున్నారు.