జమ్ము: జమ్ము బస్టాండ్ సమీపంలో ఒక బస్సులో గురువారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మొత్తం 28మంది గాయపడినట్లు సమాచారం. నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పేలుడు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు బలగాలు, భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి.ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
బస్సుపై గ్రనేడ్ దాడి జరిగినట్లు జమ్ము పోలీసు అధికారులు దృవీకరించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.