సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి ప్రధాని మోదీకి షాక్ తగిలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని మోదీకి ఎదురెళ్లే సాహసం చేస్తున్నారు. ఇది మోదీకి తలవంపు తెచ్చే వ్యవహారమే. మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అది సహజమే అయినా.. బీజేపీ పాలనలోనే ఉన్న మోదీ, అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ లోనే ఈ అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే..
వ్యవసాయ భీమా పథకం నుంచి గుజరాత్ తప్పుకుంది.. ఎందుకంటే..
మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనా’. రైతుల నుంచి ఇన్సూరెన్స్ కట్టంచుకుని పంటల్లో నష్టం వస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు నష్ట పరిహారం ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే.. ఇందులో ఎన్నో సాంకేతిక లోపాలు, వ్యాపార సంస్థల ప్రయోజనాలు తప్ప రైతులకు ఉపయోగపడేది లేదని మొదటి నుంచీ నిపుణులు చెప్తున్నారు. అయినా మోదీ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేశారు. ఈ పథకం నుంచి పంజాబ్, ఒడిషాతోపాటు పలు రాష్ట్రాలు ఎప్పుడో తప్పుకున్నాయి. ఎన్డీఏలోని బీహార్ కూడా తప్పుకుంది. ఇప్పుడు గుజరాత్ కూడా తప్పుకుంది. సొంత రాష్ట్రంలోనే ఈ పథకం అమలు చేసుకోలేని మోదీ అంటూ వచ్చే విమర్శలను మోదీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు సమాధానం కూడా వారి వద్ద కరువైంది.
ఇది పూర్తిగా వ్యాపార ప్రయోజన పథకమే..
ఫసల్ బీమా పథకం ఉద్దేశం మంచిదే. కానీ.. నిబంధనలు, సాంకేతికత, పథకం రూపకల్పన చూస్తే.. రైతుల కంటే కంపెనీలకే ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఉంది. పథకంలోని విధివిధానాలపై మొదటి నుంచీ అన్ని రాష్ట్రాలు ఈ పథకంపై వ్యతిరేకించాయి. ఇప్పుడు గుజరాత్ కూడా ఈ లిస్టులో చేరడంతో మోదీ ఎలా తీసుకాంరనేదే ప్రశ్న. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలన్న మోదీ ఆలోచనకు ఇన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ పథకంపై ఎలా ముందుకెళ్తారో చూడాలి.