స్వీట్లు అనగానే ఒక్కోచోట ఒక్క స్పెషల్టీతో తయారు చేస్తుంటారు. ఒకదగ్గర డ్రైఫ్రూట్స్ తో చేస్తే.. ఇంకో చోట స్పెషల్ నేయ్యిని వాడుతారు. వీటికి స్పెషల్ గుర్తింపునకు వాటిమీద సిల్వర్ తో చేసిన పేపర్ ను కూడా వాడుతుంటారు. కానీ స్వీట్లను బంగారంతో చేయడం చూశారా..? నిజమేనండీ.. బంగారంతో తయారు చేసిన స్వీట్లు గుజరాత్ లోని సూరత్ లో కొందరు వ్యాపారులు అమ్ముతున్నారు. అవి ఎలా చేస్తున్నారు.. ఏంటా విశేషాలు అనేవి చూసేద్దాం రండి.
బంగారం అనే మాట వింటేనే చమటలు పట్టే ఈ రోజుల్లో ఒక స్వీట్ల వ్యాపారి ఏకంగా బంగారంతో స్వీట్లు చేస్తున్నాడు. దాంతో అందరినీ ఆకట్లుకోవడమే కాకుండా ఆశ్చర్యానికి గురవుతున్నారు. దసరా, దీపావళి పండగల పూట ఈ స్వీట్లు తయారు చేస్తుండటంతో అందరి కండ్లు ఈ సీట్లపైనే ఉన్నాయి. విశేషమైన ఆదరణ కూడా వస్తోందని ఆ స్వీట్ల యజమాని చెబుతున్నాడు.
సూరత్ లోని శరద్ పూర్ణిమ అనే స్వీట్ షాపు యజమాని రోహాన్ ఈ బంగారు స్వీట్లు తయారు చేస్తున్నారు. పలు రకాల డ్రై ఫ్రూట్లు వేసి తయారు చేసే ఘరి అని పిలువ బడే స్వీట్ కు కిలో రూ. 660 నుంచి రూ. 820 వరకు అమ్ముతుంటారు. అందులో 24 క్యారెట్ల బంగారాన్ని కలిపి తయారు చేసిన స్వీట్ కు భలే డిమాండ్ వచ్చిందని నిర్వహకులు చెబుతున్నారు. దీనికి గోల్డ్ ఘరీ అనే పేరుకూడా పెట్టేశారు. మన పురాతనల్లో కూడా బంగారం విశిష్టతను గొప్పగా చెప్పారని, అది ప్రయోజనకరమైన లోహమని ఆ షాప్ యజమాని తెలిపారు.
ఈ గోల్డ్ ఘరీ కిలో రేటు రూ. 9వేలు పెట్టినట్లు తెలిపారు. మార్కెట్ లో దీనికి డిమాండు ఇప్పుడు లేకున్నా.. తమకంటూ ఒక బ్రాండ్ ఉందని ఆ షాప్ యజమాని తెలిపారు. బంగారంతో చేసే స్వీట్లు చాలా తక్కువని, రాబోయే రోజుల్లో దీనికి మంచి డిమాండు ఉంటుందని ఆ షాప్ యజమాని రోహాన్ తెలిపారు.