అగ్రరాజ్యం అమెరికాలో కొత్త ప్రధాని కొలువుదీరి రెండు రోజులు కాలేదు… అంతలోనే హింసాకాండ మొదలైపోయింది. నల్లజాతీయులు–శ్వేతజాతీయుల విద్వేషాలతో అమెరికా ఎప్పుడూ అట్టుడుకుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ దేశంలో గన్ లైసెన్స్ తీసుకోవడం కూడా చాలా సులభం.
వివరాల్లోకి వెళితే….. ఆదివారం తెల్లవారుజామున ఇండియనా రాష్ట్రంలో దుండగులు రెచ్చిపోయారు. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒక గర్భిణీ తో సహా ఆరు మంది ప్రాణాలు విడిచారు. ఇక బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో పరిస్థితి మారుతుంది అనుకుంటే అలాగే కొనసాగుతుండడం గమనార్హం. ఇక ఈ ఘటన పై అమెరికన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. అందరూ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.
ఒక గర్భిణీ పై కాల్పులు జరగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఇక పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ ముమ్మరం చేశారు. ఆ ఆరుగురిలో బిడ్డతో సహా ఒక గర్భిణి చనిపోవడం అనేది తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఇక మిగిలిన గాయపడిన వారిలో ఒక చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది. అమెరికాలో కాల్పులు ఇలా జరగడం కొత్త కాదు. కొన్నిసార్లు అయితే పాఠశాల లోని పిల్లలపై కూడా కాల్పులు జరిగాయి.
ఇక డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఆ దేశంలో జాతివివక్ష పెరిగిపోయింది. అంతేకాకుండా శ్వేతజాతీయుల అక్రమాలకు, ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఒక నల్లజాతీయుడిని పోలీసులు కొట్టి చంపడం ప్రపంచవ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిన అందరికీ తెలిసిందే. ఇక తాజాగా అమెరికా బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత వీటన్నింటికీ అడ్డుకట్ట పడుతుందని అంతా ఆశించారు. అంతేకాకుండా డెమొక్రటిక్ పార్టీకి ప్రజాస్వామ్య లౌకిక పార్టీగా ముద్ర ఉంది. ఇక ఈ నేపథ్యంలో అమెరికా ప్రశాంతంగా ఉంటుందని విదేశీయులు, వలసదారులు క్షేమంగా ఉండొచ్చని అందరూ భావిస్తూ ఉంటే ఈ కాల్పులు వారందరికీ షాక్ ఇచ్చాయనే చెప్పాలి.