హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఈ తెల్లవారుజామున కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కారులో వెళుతున్న రియల్టర్ ఇస్మాయిల్ కూల్పుల కారణంగా మృతి చెందాడు.ఇస్మాయిల్ కారులో వెళుతుండగా నిరూస్
సిగ్నల్ వద్ద బైక్ పై వచ్చిన ఓ దుండగుడు సినీ పక్కీలో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఆరు రౌండ్ లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పులు జరిపిన వ్యక్తి ముజీబ్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇస్మాయిల్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
నిరూస్ సిగ్నల్స్ వద్ద ఒక్కసారిగా పిస్టల్ కాల్పులు వినబడటంతో ఆ దారిలో వెళుతున్న వాహనదారులు భయాందోళనకు గురైయ్యారు. గండిమైసమ్మ ప్రాంతంలోని 250 గజాల స్థలానికి సంబంధించి వివాదంలోనే కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇస్మాయిల్ పై కాల్పులు జరిపి పరారైన నిందితుడు ముజీబ్ పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.