గుణశేఖర్ – సమంత ల క్రేజీ కాంబినేషన్ లో శాకుంతలం అన్న మైథలాజికల్ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవంగా రానా దగ్గుబాటి తో గుణశేఖర్ హిరణ్య కశిప సినిమా చేయాలని ప్లాన్ చేశారు. సురేష్ బాబు, గుణశేఖర్ కలిసి ఈ సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. దాదాఉ ఈ సినిమా కోసం గుణశేఖర్ రెండేళ్ళపాటు ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా చేశారు. ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లని ప్రచారం కూడా జరిగింది. అయితే కరోనా తో ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందుల వల్ల పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించాలనుకున్న హిరణ్య కశిప ప్రస్తుతానికి ఆగింది.
అందుకే గుణశేఖర్ శాకుంతలం అన్న మైథలాజికల్ సినిమాని ప్రకటించాడు. ఇక ఈ సినిమాని గుణ టీం వర్క్స్ అన్న సొంత నిర్మాణ సంస్థలో గుణశేఖర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా లో కావ్యనాయకి శాకుంతలం గా సమంత నటించబోతున్నట్టు అదికారకంగా ప్రకటించగా ఫ్యాన్స్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. చెప్పాలంటే చాలామందికి ఇది ఊహించని సర్ప్రైజ్. అయితే వాస్తవంగా గుణశేఖర్ శాకుంతలం అనౌన్స్ చేసినప్పటి నుంచి పూజా హెగ్డే పేరు వినిపించింది. కాని పూజా హెగ్డే ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం తో గుణశేఖర్ సమంత ని ఫైనల్ చేసుకున్నారట.
ఇక సమంత నటించిన గత చిత్రం జాను భారీ డిజాస్టర్ తర్వాత మళ్ళీ సినిమా ఏదీ కమిటవలేదు. ఆహా కోసం సాం జాం అన్న టాక్ షో చేస్తోంది. అలాగే సమంత నటించిన ది ఫ్యామిలీ మాన్ అన్న డెబ్యూ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీంగ్ కాబోతోంది. కాగా ఇనాళ్ళు సమంత నెక్స్ట్ సినిమా ఏంటా అన్న ఆతృతగా ఉన్న అందరికీ సూపర్ క్లారిటీ వచ్చింది. ఇదంతా బాగానే ఉంది కాని తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో శాకుంతలం ఎప్పటి నుంచి మొదలవబోతోంది అన్న క్లారిటి మాత్రం మిస్ అయింది. ఇప్పుడు అందరు ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారట.