గుణశేఖర్ సినిమాలో హీరోయిన్ కి ఎంత ప్రత్యేకత ఉంటుందో ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన మనోహరం సినిమా లాగే ఒక్కడు, అర్జున్, రుద్రమదేవి లాంటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు భూమిక జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమాలో భూమిక ది ఎంతో ప్రత్యేకమైన పాత్ర. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో భూమిక రేంజ్ అమాంతం పెరిగిపోయింది కూడా. ఇక రుద్రమదేవి సినిమాలో అనుష్క శెట్టి ని అద్భుతంగా చూపించాడు.
అందుకే గుణశేఖర్ దర్శకత్వంలో నటించడానికి హీరోలు మాత్రమే కాదు స్టార్ హీరోయిన్స్ కూడా ఎంతో తాపత్రయ పడుతుంటారు. కాగా రానా హీరోగా హిరణ్యకశ్యప సినిమా తెరకెక్కాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చేందుకు కాస్త సమయం పడుతుందని వార్తలు వస్తున్నాయి. అందుకే గుణశేఖర్ ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. శాకుంతలం అన్న టైటిల్ తో ఈ సినిమాను తీయబోతున్నట్లుగా గుణశేఖర్ అధికారకంగా ప్రకటించాడు. టైటిల్ తోనే ఈ సినిమా మీద బాగా బజ్ క్రియేట్ అయింది. అయితే గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అనుష్క శెట్టి శాకుంతలం గా నటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గుణశేఖర్ శాకుంతలం గా నటించబోతోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన ఏదీ ఇంకా రానప్పటికి ప్రస్తుతం తెలుగులో కొత్త సినిమా ఏదీ ఒకే చేయని పూజా హెగ్డే రీసెంట్ గా గుణశేఖర్ శాకుంతలం గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. కాగా ఈ సినిమాని 2021 జనవరి తర్వాత సెట్స్ మీదకి రానుందని తెలుస్తోంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!