(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి ప్రాంతంలో పోలీసులు ఎవరిపైనా దాడి చేయలేదని గుంటూరు రూరల్ ఎస్పి విజయ్ రావు తెలిపారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ముందుగానే ప్రకటించామన్నారు. మహిళలపై లాఠీ చార్జి అవాస్థవమనీ, మహిళలను మహిళా కానిస్టేబుళ్లే అడ్డుకున్నారని తెలిపారు. పెద్ద సంఖ్యలో గుడిగూడినప్పుడు కొంతమందికి కాళ్లు, చేతులకు దెబ్బలు తగలడం సహజమన్నారు. చట్ట విరుద్ధంగా ఒకే సారి గుంపుగా రావడం వల్లనే వారిని అడ్డుకున్నామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తున్నామని ఆయన చెప్పారు.
తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తే గంటల వ్యవధిలో అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. అటువంటి వారిపై సైబర్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుళ్లూరులో ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని రైతు ఆత్మహత్య చేసుకున్నారనేది అవాస్తవమని అన్నారు. మీడియా ప్రతినిధులపై ఆంక్షలు పెట్టలేదని తెలిపారు.