Guppedantha Manasu November 16Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 16వ తేదీ Guppedantha Manasu సీరియల్ 609 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం..ఈరోజు గుప్పెడంత మనసు నేటి కథనం చాలా ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి.
వసు, రిషిని పెళ్లిచేసుకోమన్న గౌతమ్ :
ఈరోజు ఎపిసోడ్ లో వసు చాలా బాధపడుతూ మేడం వాళ్లు ఎక్కడ ఉన్నారో చెప్పండి సార్ అంటుంది వసు. నాకెలా తెలుస్తుంది అంటాడు గౌతమ్. ఒకవేళ నువ్వు, రిషి పెళ్లి చేసుకుంటే వాళ్ళు వస్తారేమో అంటాడు గౌతమ్. వాళ్ల కోసం నేను మీడియా ఇంటర్వ్యూనే పోస్ట్ పోన్ చేసుకున్నాను అలాంటిది పెళ్లి ఎలా చేసుకుంటాను సార్ అంటుంది వసుధార. ఎందుకు అలా చేసావ్ అని గౌతమ్ అడగగా నా గెలుపుకి మూల కారణం జగతి మేడం, ఆమె లేకపోతే నాకు ఈ విజయం లేదు అంటుంది. నువ్వు మీ మేడం కోసం, వాడు వాళ్ళ డాడ్ కోసం ఇలా ఎన్నాళ్ళని ఎదురు చూస్తారు అంటాడు గౌతమ్. వాళ్లు వచ్చేవరకు ఎదురుచూస్తాం సార్ అంటుంది వసు.సీన్ కట్ చేస్తే మీడియా అతను రిషి కి ఫోన్ చేసి మేడమ్ ఇంటర్వ్యూ వాయిదా వేశారు అని చెప్తాడు.రిషి షాక్ అయ్యి ఇంటర్వ్యూ జరుగుతుంది మిగతా డీటెయిల్స్ నేను చెప్తాను అని ఫోన్ పెట్టేస్తాడు రిషి.
గౌతమ్ ను తిట్టిన రిషి :
అసలు ఈ పొగరుకి ఏమైంది ఇంటర్వ్యూ వాయిదా వేసింది. కనీసం నాకు ఒక మాట చెప్పాలి కదా అని వసును కలవడానికి వెళ్తాడు. దారిలో కనిపించిన గౌతమ్ ని వసు ఏది అని అడుగుతాడు. తను ఇప్పుడే బయటకు వెళ్లి పోయింది అంటాడు గౌతమ్. ఎందుకు అని రిషి అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్తాడు గౌతమ్. నువ్వు వసుకి సలహా ఇవ్వవలసిన అవసరం ఏమీ లేదు.మేడం అంటే వసుకి ఎంత ఇష్టమో నాకు తెలుసు, డాడ్ అంటే నాకు ఎంత ఇష్టమో తనకి తెలుసు అలాంటిది వాళ్ళిద్దరూ లేకుండా మేము పెళ్లి ఎలా చేసుకుంటాం అనుకున్నావ్ అని రిషి గౌతమ్ ను తిట్టి వసు ఎక్కడా అని అడుగుతాడు.తెలియదు అని గౌతమ్ సమాధానం చెబుతాడు.
వసు కోసం రిషి వెతుకులాట:
సరే తాను ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు అని అక్కడ నుంచి బయలుదేరుతాడు రిషి. బయటకు వెళ్ళిన వసు అమ్మవారి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటుంది. నీకు ఎన్నిసార్లు దండం పెట్టుకున్నాను తల్లి,ఆ తల్లి కొడుకులని కలపమని, జగతి మేడం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాను అని తల్లికి దండం పెట్టుకొని వెనక తిరిగేసరికి రిషి కనిపిస్తాడు. నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుసు అంటుంది. ఆ మాత్రం తెలుసుకోలేనా వసుధార అంటాడు రిషి. అంతా అమ్మవారికి చెప్పి దండం పెట్టుకున్నావు కదా, ఆ అమ్మవారు నీకు ఎప్పుడు అన్యాయం చేయదు, నీకు అంతా మంచే జరుగుతుంది అని వసూని అక్కడినుంచి తీసుకెళ్లిపోతాడు రిషి.ఇంటర్వ్యూ ఎందుకు పోస్ట్ పోన్ చేసావని వసును అడుగుతాడు.మేడం లేరని ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ చేయటం ఏమిటి? నువ్వు సాధించిన విజయం లోకానికి తెలియాలి అంటాడు రిషి.నేను ఈ విజయం సాధించడానికి కారణం జగతి మేడం ఆవిడ పక్కన లేకుండా నా విజయం గురించి చెప్పుకుంటే అది అసంపూర్ణం అవుతుంది అని,మేడం నా పక్కన ఉంటే ఆ ధైర్యం వేరు అని రిషిని పట్టుకొని ఏడ్చేస్తుంది.జగతి మేడం వస్తారని ఆశిద్దాం అని ధైర్యం చెప్పి ఇంటికి తీసుకువెళ్తాడు.
మహేంద్ర, జగతి గురించి తెలుసుకున్న పెదనాన్న :
ఇంట్లో గౌతం పెదనానికి జరిగిన విషయం అంత చెప్తాడు. ఇంత జరుగుతుంటే మీరందరూ ఏం చేస్తున్నారు అంటాడు.మేము చాలా ట్రై చేస్తున్నాము అంటాడు గౌతమ్. వాళ్ళు దొరక్కకూడదని నిర్ణయించుకున్నాక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ అంటాడు పెదనాన్న.ఈ సమయంలో నువ్వే రిషి కి తోడుండాలంటాడు గౌతమ్ ను. అయితే గౌతమ్ మాత్రం పెదనాన్న నాకన్నా రిషిని చాలా బాగా వసుధార చూసుకుంటుంది అని చెప్తాడు గౌతమ్.
వసుకు అభినంధన మాల :
అప్పుడే అక్కడికి వచ్చిన రిషి,పెదనాన్నని చూసి ఎప్పుడు వచ్చారు పెదనాన్న అని ఆప్యాయంగా పలకరిస్తాడు.వసుకి యూనివర్సిటీ టాపర్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తాడు పెదనాన్న. జరిగిందంతా తెలిసింది మహేంద్ర వాళ్ళని తీసుకురావడం ఒక నీవల్లే అవుతుంది. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం అంటాడు పెదనాన్న. మీరు వెళ్లిన పని ఏమైంది అంటాడు రిషి.నేను వేరే రాష్ట్రాల మినిస్టర్స్ తో కూడా మాట్లాడాను వాళ్లు కూడా మిషన్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ గా ఉన్నారు అంటాడు.మరి తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.