Guppedantha manasu :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 571వ ఎపిసోడ్ లోకి ఎంటర్ ఆయింది. ఇక ఈరోజు అక్టోబర్ 04 న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో దేవయాని కార్చిన దొంగ కన్నీరు చూసి రిషి ఒక్కసారిగా చలించిపోతాడు. పెద్దమ్మను బాధ పెట్టింది మహేంద్రా అని తెలుసుకొని పెద్దమ్మకు సారీ చెప్పండి డాడ్ అని మహేంద్రను అడుగుతాడు. మహేంద్ర ఎంతసేపటికి దేవయానికి సారీ చెప్పకపోవడంతో రిషి అన్నం మీద అలిగి వెళ్లిపోబోతుంటే మహేంద్ర దేవయాని దగ్గరకు వెళ్లి సారీ వదిన గారు అని గట్టిగా చెబుతాడు. అప్పుడు రిషి వచ్చి అన్నం తింటాడు.
ఒకరి ఆలోచనల్లో మరొకరు :
ఇక ఈరోజు ఎపిసోడ్ లో రిషి.. వసు పంపిన మెసేజెస్ చూసుకుంటూ ఉంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే వసు మాట్లాడుతుంది. రేపు సైట్ విజిట్ కు వెళ్ళాలి అని వసు అనడంతో రిషి ఇగో కాస్త దెబ్బ తింటుంది. వెళదాం అని వసు దార అనవచ్చుగా అని రిషి అనుకుంటే వసు నువ్వు కూడా రా అని సార్ ఎందుకు అనడం లేదు అని వసు కూడా అనుకుంటూ ఉంటుంది..
మహేంద్ర మనసులో బాధ :
మరుసటి రోజు ఉదయం మహేంద్ర, జగతి ఇద్దరు కలిసి కాలేజ్ కి వెళ్తూ ఉంటారు. అప్పుడే రిషి వచ్చి గుడ్ మార్నింగ్ డాడ్ అంటే మహేంద్ర కాస్త ముబావంగా గుడ్ మార్నింగ్ చెబుతాడు. డాడ్ మీతో మాట్లాడాలి అని అనబోతుంటే జగతి కాలేజీకి లేట్ అవుతుంది వెళ్దామా అని మహేంద్ర బయటకు వచ్చేస్తాడు. అప్పుడే ఎవరో ఫోన్ చేసి జగతి ఎవరు మహేంద్ర అంటే లైబ్రరీలో పుస్తకాలు ఆర్డర్ పెట్టాను కదా తొందరగా రమ్మంటున్నారు అని లైబ్రరీయన్ కాల్ చేశాడని మహేంద్ర అంటాడు.
రిషి మనసు అర్ధం చేసుకున్న జగతి :
అయితే రిషి మహేంద్రతో ఒంటరిగా ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాడు అని గ్రహించిన జగతి మహేంద్రను ఆపి నాకు కొంచెం షాపింగ్ చేసుకునే పని ఉంది నువ్వు రుషితో వచ్చేయ్ అని చెప్పి అంటుంది జగతి. ఇక రిషి మాత్రం జగతికి మనసులోనే థాంక్స్ చెప్పి నేను డాడ్ తో మాట్లాడాలని మేడం నిజంగా గ్రహించారా లేక నిజంగానే మేడమ్ కి షాపింగ్ చేసే పని ఏదన్నా ఉందా అని ఆలోచనలో పడతాడు రిషి. ఇక జగతి వెళ్ళిపోగానే రిషి, మహేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.
తండ్రి, కొడుకుల అనుబంధం :
నిన్న జరిగిన దానికి కోపం వచ్చిందా డాడ్ అంటే అది ఎప్పుడో మర్చిపోయా రిషి అంటాడు మహేంద్ర. నువ్వు సంతోషంగా ఉండాలంటే నేను వంద సార్లు అయినా సారీ చెప్పడానికి రెడీగా ఉన్నాను అని మహేంద్ర అంటాడు. ఆ మాటలకు రిషి కాస్త ఎమోషనల్ అవుతాడు. చెప్పు రిషి నీ సంతోషం కోసం నేనేం చేయగలను చెప్పు అని అంటాడు మహేంద్ర. డాడీ నాకు వస్తారని నుంచి స్వచ్ఛమైన ప్రేమ కావాలి అని చెప్పి రిషి అడుగుతాడు. ఇక మహేంద్ర మనసులో రిషి ఇండైరెక్ట్ గా గురుదక్షిణ గురించి నాతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు. డాడ్ మీరు నేను ఇద్దరమ్మా ఒక మంచి ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం కదా ఒక ఫ్రెండ్ బాధ ఇంకొక ఫ్రెండ్ అర్థం చేసుకోలేడా డాడీ అని రిషి అంటాడు.
వసు స్కూటీ కొనుకుందా..?
ఇక ఇద్దరూ కలిసి కాలేజీకి వస్తారు. కాలేజ్ దగ్గరికి రాంగానే బయట పార్కింగ్ లో ఉన్న స్కూటీ చూసి రిషి ఒకసారిగా షాక్ అవుతాడు ఆ స్కూటీ వెనకాల వి ఆర్ అని రాసి ఉండటం చూసి అచ్చం వసుధార ఆలోచనల లాగానే ఉన్నాయి అని మనసులో అనుకుంటాడు. ఇక వసు జగతి మేడంను కలిసి సైట్ విసిట్ కి వెళ్ళాలి కదా మేడం అని అంటుంది. జగతి మాత్రం వసు నేను రావడం కుదరదు నాకు కొంచెం హెడేక్ గా ఉంది అని అంటుంది జగతి ఇంతలో మహేంద్ర వస్తాడు మహేంద్ర రావడంతోనే వసుధారని, జగతిని చూసి ఎవరికి న్యాయం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేనున్నాను అని మనసులోనే బాధపడతాడు.
జగతి, వసులను చూసి మనసులో మధన పడుతున్న మహేంద్ర :
ఆ మహేంద్ర సర్ జగతి మేడం సైట్ విసిటింగ్ కి రాను అంటున్నారు అని వసూలు చెప్పటంతో సరే నేను వస్తాను నీతోటి అని మహేంద్ర అంటాడు కానీ జగతి మాత్రం మహేంద్ర మనకి కాలేజీలో చాలా పనులు ఉన్నాయి అవన్నీ మర్చిపోయావా అని అనటంతోటి ఆ అవును కదా మర్చిపోయాను జగతి అని మహేంద్ర అంటాడు ఇక వసుధార మాత్రం సరే సార్ నేను వెళ్లి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక వసు వెళ్లిపోవడంతో మహేంద్ర అంటాడు వసుధాలతో పాటు రిషి వెళ్తే బావుండు కదా అని జగతితో అంటే అలా అనుకోవడం తప్ప మనమేం చేయగలంలే మహేంద్ర అని జగతి అంటుంది. ఇక వసు రిషి కేబిన్ లోకి వెళ్లి తనలో తనే మాట్లాడుకుంటూ ఉండడంతో సీరియల్ ముగుస్తుంది.