ఢిల్లీ ఫిబ్రవరి 25 : కుల రాజకీయాలు, అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమా అని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు. గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబుపై జివిఎల్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబుకు సవాల్ విసిరారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ….రాష్ట్రంలో అవినీతి, కుల రాజకీయాలు ప్రజలను భాదిస్తున్నాయని జివిఎల్ అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా బీజేపీ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలు అవినీతిలో ముందున్నాయని జివిఎల్ అన్నారు. కేంద్రం చేసిన ప్రతి పనిపైనా స్టిక్కర్ వేసుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్రానివేనని జివిఎల్ అన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వానివిగా చెప్పుకుంటున్నారని జివిఎల్ విమర్శించారు.
కేంద్రం పోలవరానికి నిధులిస్తున్నా తానే నిర్మిస్తునని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని జివిఎల్ మండిపడ్డారు.
రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే తాత్కాలిక భవనాలకు మాత్రమే పరిమితమయ్యారని జివిఎల్ అన్నారు. లక్షన్నర కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..రాజధాని నిర్మాణానికి నిధులు ఖర్చు చేయలేదని జివిఎల్ ఆరోపించారు. గ్రాఫిక్స్కే అమరావతి అభివృద్ధి పరిమితమైందని జివిఎల్ అన్నారు. అమరావతి నిర్మాణంలో చేసింది శూన్యం.. చెప్పింది అధికం అని జివిఎల్ అన్నారు. చంద్రబాబు కోతల రాయుడిలా వ్యవహరిస్తున్నారు అని జివిఎల్ ఎద్దేవా చేశారు.
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో నిజమైన రైతులకు అన్యాయం జరుగుతోందని… రైతులు కాని వారి అకౌంట్లలోకి డబ్బులు వెళుతున్నాయని ఆరోపించారు.
ఈడీ,సీబీఐ, ఐటీ శాఖలను తలచుకుంటూ ప్రతి రోజూ చంద్రబాబు భయపడుతున్నారని జివిఎల్ పేర్కొన్నారు.
గత నాలుగున్నరేళ్లలో ఏం చేశారో చెప్పకుండా… ఇతర పార్టీలపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారని జివిఎల్ అన్నారు. తెలంగాణలో టిడిపిని తిరస్కరించారనీ… ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతోందని జివిఎల్ జోస్యం చెప్పారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?