హైదరాబాద్, మర్చి 4: ఐటి గ్రిడ్ ఇండియా డైరెక్టర్ అశోక్ హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ దానిని కొట్టివేశారు.
తమ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారని ఐటి గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ ఆదివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అదుపులోకి తీసుకున్న ఉద్యోగులను సోమవారం ఉదయం 10.30గంటలకల్లా తమ ముందు హజరుపర్చాలని పోలీసులను ఆదివారం హైకోర్టు ఆదేశించింది.
ఐటి గ్రిగ్ ఉద్యోగులు భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్లను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. తమను ఎవరూ అదుపులోకి తీసుకోలేదని వారు న్యాయమూర్తికి తెలియజేశారు.
దీంతో సంస్థ డైరెక్టర్ అశోక్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేశారు.