తెలుగు ప్రేక్షకులు ఆనందించే వార్త ఇది.తమ తెరవేలుపుకి కరోనా అని తెలిసి బాధపడిన గుండెలు ఎన్నో..ఎన్నెన్నో!వాళ్లంతా ఇప్పుడు సంబరాలు చేసుకోవచ్చు.మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగెటివ్ అని తేలింది.
అదేంటి నాలుగు రోజుల క్రితం పాజిటివ్ వచ్చి వెంటనే నెగిటివ్ ఎలా అయిందని ఆశ్చర్యపోతున్నారా? అదే ఇక్కడి ప్రధాన వార్తాంశం.ఆయనకు కరోనా పాజిటివ్ అని తేల్చిన ఆర్టీపీసీఆర్ కిట్ లోపభూయిష్టమైంది కావడంతో తప్పుడు నివేదిక వచ్చింది. ఆదివారం పాజిటివ్ రిపోర్టు రాగానే వెంటనే మెడికేషన్ ప్రారంభించిన చిరంజీవికి రెండు రోజులైనా ఎలాంటి కోవిడు లక్షణాలు కనిపించలేదు.దీంతో అసలు తనకు కరోనా సోకిందా లేదా అని అనుమాన పడి ఆయన కరోనాను ధ్రువీకరించే మూడు రకాల పరీక్షలు చేయించుకోగా అన్నీ నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి.అసలేం జరిగిందో చిరంజీవిగారి మాటల్లోనే …”కరోనా రిపోర్టు నన్ను కన్ఫ్యూజ్ చేసి ఆడేసుకుంది.
ఆదివారం ఈ రిపోర్టు రాగానే బేసిక్ మెడికేషన్ ప్రారంభించాను.రెండు రోజులైనా ఎక్కడా ఎలాంటి కరొినా లక్షణాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి అపోలో ఆస్పత్రి డాక్టర్లను అప్రోచ్ అయ్యాను.వారు సీటీ స్కాన్ చేసి చెస్టులో ఎలాంటి కరొినా ట్రేసెస్ లేవని చెప్పారు.అక్కడ నెగిటివ్ రిపోర్టు వచ్చాక మరొకసారి అనుమానాన్ని నివృత్తి చేసుకుందామని టెనెటు ల్యాబులో మూడు రకాల కిట్లతో పరీక్షలు చేయించుకున్నాను.అన్ని పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.చివరగా మొదట నాకు పాజిటివ్ అని నివేదిక ఇచ్చిన చోట మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్నాను.అక్కడ నెగిటివ్ రిపోర్టు వచ్చింది.చివరగా వీటన్నిటినీ చూసిన వైద్యులు మొదట టెస్టు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ కిట్టు లోపభూయిష్టమైంది కావడంతో తప్పుడు రిపోర్టు వచ్చిందని తేల్చారు.
ఈ సమయంలో నా పట్ల అభిమానం,నా అనారోగ్యం పట్ల ఆందోళన చూపి నేను కోలుకోవాలని పూజలు కూడా చేసిన వారందరికీ కృతజ్ఞతలు” అని ట్వీట్ చేశారు.ఇది సంతోషకరమైన వార్తే కావొచ్చుగానీ ఒక మెగాస్టార్ కి నిర్వహించిన పరీక్ష నివేదికే తప్పుగా వస్తే….ఎంత మంది సామాన్యులు ఇలాంటి తప్పుడు రిపోర్టులు కారణంగా ఇబ్బందులు పడి ఉంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశం. వీఐపీలు టెస్ట్లు చేయించుకునే కాస్ట్లీల్యాబుల్లో కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని చిరంజీవి ఉదంతం చాటిచెప్పింది.మరి సామాన్యుడు వెళ్లే నాసిరకం ల్యాబుల పరిస్థితి ఏమిటన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి తప్పుడు పాజిటివ్ నివేదిక వ్యవహారాన్ని ప్రభుత్వాలు కూడా సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరముందని ఆయన అభిమానులు అంటున్నారు.