అహమ్మదాబాద్ (గుజరాత్) : గుజరాత్కు చెందిన పటేదార్ అద్యమనేత హర్ధీక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిబ్ల్యుసి సమావేశం సమావేశం సందర్భంగా మంగళవారం అహమ్మదాబాద్ విచ్చేసిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పటీదార్ ఉద్యమనేత హర్ధీక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు రాహుల్ గాంధీ పార్టీ కండువా కప్పిసాదరంగా ఆహ్వనించారు.
గుజరాత్ రాష్ట్రంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గంగా ఉన్న పటేళ్లకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ హార్థిక్ పటేల్ నాలుగేళ్లుగా ఉద్యమం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ సహకారం లేకుండా పెద్ద ఉద్యమాలను నిర్వహిస్తూ అధికార బిజెపికి ఇబ్బందులు కల్గిస్తూ వచ్చాడు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హార్థిక పటేల్కు టికెట్ కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.