“కొంటె రాక్షసుడు మంచి మనుషులు” టాస్క్ లో బిగ్ బాస్ పురం రాజ్యంలో మనుషుల టీం రాక్షసుల టీం మధ్య పోటీ హోరా హోరీ గా ఉంది. అయితే మనుషుల టీం బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లను విజయవంతంగా పూర్తి చేస్తూ… రాక్షసుల గ్రూపులో ఉన్నవారిని మంచి మనుషులుగా మారుస్తున్నారు. ఈ క్రమంలో అఖిల్ నీ ఆ విధంగానే మార్చడం జరిగింది. ఒక్క రాక్షసుడు మంచి మనిషిగా మారిన… పది తలలు కలిగిన రావణుడులో రెండు తలలు పగలగొట్టాలని రూల్.
“కొంటె రాక్షసుడు మంచి మనుషులు” టాస్క్ లో భాగంగా రెండో టాస్క్ ప్రమిదల దీపాలు వెలిగించాలని…. మనుషుల టీంకి బిగ్ బాస్ సవాలు చేయగా… దాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఈ క్రమంలో మనుషులుగా మార్చాలని రాక్షసుడైన అవినాష్, మహబూబ్ లని పట్టుకోవటానికి… మంచి మనుషులు టీం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారు దొరకకపోవడంతో.. చివరాకరికి చేతికి చిక్కిన హారిక ను మంచి మనిషిగా మార్చారు.
అయితే ఇక్కడ మొదట హారిక కి మంచి మనిషిగా మాట్లాడటం ఇష్టం అయినా గాని తన చివరి స్థానం మంచి మనుషుల టీం కల్పించడంతో… కెమెరాల ముందు ఫీల్ అయిపోయి బోరున ఏడ్చేసింది. మొదట తన పేరు చెప్పకపోవడంతో తాను మనిషిగా మారిన ఆ టైం కి ఎలాంటి సహాయం చేయను అంటూ కెమెరాల ముందు కన్నీరు మున్నీరు అయ్యింది హారిక.