Harish Rao : ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రాబోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో మంత్రి హరీష్ రావు Harish Rao స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం మంచి నీటి కష్టాలు లేకుండా చేసిందని తెలిపారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమయంలో భారీ స్థాయిలో కరెంటు బిల్లులు ముక్కుపిండి వసూలు చేశారని గుర్తు చేశారు. అదే రీతిలో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తు ఉత్తుత్తి విద్యుత్ అందించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే కరెంట్ కష్టాలు ఎదుర్కోవడం జరిగిందని అప్పట్లో రైతు చనిపోతే ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి ప్రభుత్వం లేదని కానీ ఇప్పుడు రాష్ట్రంలో రైతు చనిపోతే ఐదు లక్షల బీమా మొత్తం సదరు రైతు ఇంటికి పంపుతున్నట్లు పేర్కొన్నారు.
కొంతమంది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందని అడుగుతున్నారని ఉచిత కరెంటు రైతు పెట్టుబడి సాయం, కల్యాణ లక్ష్మి, రైతు బీమా ఇలా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో చేస్తున్నట్లు హరీష్ స్పష్టం చేశారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు విషయంలో రాయితీలు కూడా కల్పించే ఆలోచన సీఎం కేసీఆర్ చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు రెండు కోట్ల ఎకరాలు ఏడాదిపాటు సాగు అవుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే షర్మిల నిన్న మీడియా ముందు చేసిన కామెంట్లకి కౌంటర్లు వేసినట్లు తెలంగాణ రాజకీయాల టాక్ నడుస్తుంది. షర్మిల నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయిన తరుణంలో మీడియా ముందు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎవరు సంతోషంగా లేరని విద్యార్థులు కూడా అనేక వాస్తవాలు ఇబ్బందులు పడుతున్నారని భారీ స్థాయిలో ప్రభుత్వంపై కామెంట్లు చేసే దిశగా ఆమె వ్యాఖ్యలు ఉండడం జరిగాయి. దీంతో తాజాగా హరీష్ రావు .. షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఇటీవల జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో కౌంటర్లు వేశారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.