కేంద్ర ప్రభుత్వ తీరుపై టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన ఇంపోర్ట్స్ మరియు ఎక్సపోర్ట్స్ పాలసీ వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోపించారు. రైతులకు నష్టం జరిగే ఈ పాలసీ పై కేంద్రం పునరాలోచించాలని సమీక్ష జరపాలని హరీష్ రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆఫ్రికా దేశాల నుంచి కందులు కొంటే మన రైతుల పరిస్థితి ఏంటి అని హరీష్ ప్రశ్నించారు.
సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రభుత్వ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన హరీష్ రావు హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు. రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. మరి ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కరోనా లాంటి సంక్షోభ కష్ట సమయంలో కూడా పెట్టుబడి సాయం అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. ఏదిఏమైనా దేశంలో రైతు లాభం పొందాలంటే ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ లు కేంద్రం ఆపాలని హరీష్ రావు కోరారు.