హర్యానా లోని ఒక మినిస్టర్ కరోనా బారిన పడ్డారు. దీనిలో కొత్త ఏముంది, గత సంవత్సర కాలం నుండి ప్రజలు మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రముఖులు సైతం కరోనా బారిన పడ్డారు. వారిలో కొంతమంది చికిత్స తో కోలుకోని బయటపడగా, మరి కొంతమంది తమ ప్రాణాలని విడిచారు. ఇది నిజ, ఈ మినిస్టర్ కి కరోనా రావడం చర్చించుకోవాల్సిన విషయమే.
I have been tested Corona positive. I am admitted in Civil Hospital Ambala Cantt. All those who have come in close contact to me are advised to get themselves tested for corona.
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) December 5, 2020
ఎందుకంటే, ఇంకొక రెండు మూడు వారలో కరోనా టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయని నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశాలలో ప్రధాని నరేంద్ర మోడీ తెలియచేసారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవ్యాక్సిన్ అతి చవక ధరకు లభించనున్నట్లు, పైగా భారత్ అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తి సామర్ధ్యం కూడా ఉందని ప్రధాని ఈ టీకా గురించి తెలియ చేసారు. ఈ టీకా చివరి దశ లో ఉంది అనే విషయం మనందరికీ తేలిసిందే. దీని ఫలితాల కోసం అందరు ఎదురు చూస్తున్న వేళా , ఈ టీకా చివరి దశలో పాల్గొన్న మంత్రికి కరోనా రావడం చర్చనీయంశమైంది. ఆరోగ్య శాఖ మంత్రి అయినా అనిల్ విజ్… నవంబర్ 20 వ తేదీన జరిగిన భారత్ బయోటెక్ చివరి దశ ట్రైల్స్ లో భాగంగా తాను మొదటిగా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ప్రస్తుతం, తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో అంబాలలోని సివిల్ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్నట్లు, తనకి గత వారం రోజులుగా సన్నిహితంగా ఉన్న వారందరు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మంత్రి తన ట్విటర్ వేదికగా తెలియ చేసారు.
అయితే కోవ్యాక్సిన్ టీకా తీసుకొని నెల రోజులు కాకముందే, మంత్రి కరోనా బారిన పడడం అందరిని ఆందోళనికి గురి చేస్తుంది. కరోనా కి టీకా వచ్చేసింది అని అందరు కొంచెం ఊపిరి పీల్చుకున్న వేళా, వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడం. కరోనా కు టీకా ఎంత వరకు పని చేస్తుంది అనే సందేహాలు మొదలయ్యాయి. మరి దీని మీద భారత్ బయోటెక్ సంస్థ ఎలా స్పందిస్తదో వేచి చూడక తప్పదు.
వ్యాక్సిన్ వచ్చిన కూడా మాస్క్, శానిటైజర్ వాడకం సామజిక దూరం మన జీవితంలో నిత్యకృత్యాలు అవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది.