కరోనా దెబ్బకి టాలీవుడ్ సినిమాల పరిస్థితి అంతా తారుమారయిన సంగతి తెల్సిందే. దాంతో కొన్ని సినిమాలు సంక్రాంతికి కొన్ని సినిమాలు సమ్మర్ కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల లాక్ డౌన్ తర్వాత మొదలైన భారీ బడ్జెట్ సినిమాలన్ని చక చకా షూటింగ్స్ ని జరుపుకుంటున్నాయి. అయితే థియోటర్స్ ఓపెన్ అయినా సంక్రాంతి సీజన్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో అర్థం కాని పరిస్థితి. కొందరేమో సంక్రాంతికి కొన్ని అనుకున్న సినిమాలన్ని రిలీజ్ కావడం కష్టమని అంటున్నారు.
అందుకే నెమ్మదిగా టాలీవుడ్ సినిమాలన్ని డేట్ల సర్దుబాటు జరుగుతోందని అంటున్నారు. ఈ క్రమంలో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ 2021 సంక్రాంతికి వస్తుందని భావించారు. కాని ఈ సినిమా సంక్రాంతికి కాకుండా ఏప్రిల్ లేదా మే లో రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అలాగే రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ జూన్ లేదా జూలై లో రిలీజ్ అనుకున్నారు. కాని ఈ సినిమా కూడా అక్టోబర్ కి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు.
ఇక అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా సమ్మర్ లో అంటే మే లేదా జూన్ లో రిలీజ్ అని అన్నప్పటికి క్లారిటీ మాత్రం లేదంటున్నారు. కొరటాల శివ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్ లో ఆచార్య ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఇటీవలే షూటింగ్ ప్రారంభించి శరవేగంగా జరుపుతున్నారు.
ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ కూడా సమ్మర్ లోనే రిలీజ్ అంటున్నారు. కాని పక్కాగా ఎప్పుడొస్తారన్నది క్లారిటీ లేదు. అయితే ఏ సినిమా గనక రిలీజ్ లేకపోతే మే లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ తెలుగు రీమేక్.. మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట ఇంకా షూటింగ్ మొదలవలేదు కాబట్టి ఇపుడే ఆ సినిమాల గురించి మాట్లాడటం కష్టం.