2000 rupees: మన దేశంలోని అన్ని కరెన్సీ నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తున్న విషయం తెలిసిందే. అయితే, నోట్ల ముద్రణ సమయంలో ఆర్బీఐ కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. సెక్యూరిటీ పరంగానే కాకుండా క్వాలిటీలోనూ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. మన దేశంలో ఒకప్పుడు రూపాయి నోటు నుంచి వెయ్యి రూపాయల వరకు కరెన్సీ నోట్లు చెలామణీలో ఉండేవి. 2014లో మోడీ (modi) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకొచ్చింది. గతంలో ఉన్న వెయ్యి రూపాయల నోటును తీసేసి రూ. 2 వేల నోటుతో పాటు రూ.200 నోటును కూడా చెలామణిలోకి తీసుకొచ్చారు.
Bjp : 2000 నోటు ఉందా… వదిలించుకోండి!
నల్లటి చారలు ఎందుకోసం..
ఆర్బీఐ(RBI) విడుదల చేసే ప్రతీ నోటుపై అనేక భద్రతా అంశాలను పరిగణలోకి తీసుకుని ముద్రిస్తారు. ఇందులో సెక్యూరిటీ అంశాలు చాలా ఉంటాయి. ఒకప్పుడు కరెన్సీని పేపర్ తో తయారు చేసేవారు. ఆ తర్వాత పేపర్ లాంటిదే కానీ, నీళ్లలో తడిసినా, మడత బడినా చినగకుండా ఉండే పదార్థంతో ఈ నోట్లను తయార చేస్తున్నారు. అయితే, ఆర్బీఐ ముద్రించే నోట్లపై నల్లని చారలను మీరు ఎప్పుడైనా గుర్తించరా..? చాలా మంది వీటిని ఏదో సెక్యూరిటీ కోసం లేదా సీరియల్ ఆర్డర్ కోసం అని అనుకుంటారు. కానీ దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.
Currency Notes : రూ. 2000 నోట్ల ముద్రణ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!!
ప్రత్యేకంగా వారికోసమేనట..
సాధారణంగా వంద రూపాయల నోటు నుంచి రూ.2000 నోట్లపై ఈ నల్లని చారలను గుర్తించవచ్చును. వీటిని ప్రత్యేకంగా అంధులను దృష్టిలో ఉంచుకుని ముద్రిస్తారని తెలిసింది. నోటుపై ఉన్న చారలను టచ్ చేసినపుడు స్పర్శ కలుగుతుంది. వీటిని బట్టి ఈ నోట్ వాల్యూ ఎంత అని అంధులు గుర్తిస్తారట.. ఏ నోటుపై ఎన్నిచారలు ఉంటాయంటే.. రూ.100 నోటుపై (|| ||) ఉండగా.. అదే 200 నోటుపై నాలుగు గీతలు రెండు చుక్కలు (|| 00 ||) ఉంటాయి. ఇక 500 నోటుపై(notes) ఐదు గీతలుండగా.. (|| | ||) రూ. 2000నోటుపై ఏడు గీతలు ( | || | || |) ఉంటాయి. ఈ గీతలను ముట్టుకుని అంధులు డబ్బులను ఉపయోగిస్తుంటారు.
రూ 2000 నోట్ చిరిగిందా..అయితే.. ఇలా చేయండి!