ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా ఎన్నుకున్నవారు ముఖ్యంగా రైల్వే జాబ్ కోసం ఎదురుచూసే వారు ఎక్కువమంది ఉంటారు.ఇందులో మంచి జీతంతో పాటు, అలోవెన్సెస్, కోర్ట్స్ కూడా అందిస్తారు.
కరోనా సమయం లో నిరుద్యోగులకు భారత ప్రభుత్వ రైల్వే తీపి కబురు అందించింది. యూపీలోని రాయ్ బరేలీలోని మోడ్రన్ ఫ్యాక్టరీ పలు ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.పదో తరగతి, ఐటీఐ(సంబంధిత ట్రేడుల్లో) లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 1ఆఖరు తేదీ.మొత్తం 110 పోస్టులకు నియామకాలను చేపట్టినట్లు తెలిపింది. ఇందులో ఫిట్టర్ పోస్టులు 55, ఎలక్ట్రీషియన్-35, వెల్డర్-55 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో చెప్పారు. 15 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అకాడమిక్స్ లో మెరిట్ ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
మొత్తం ఉద్యోగ ఖాళీలు: 110
ఖాళీలు: ఫిట్టర్-55, ఎలక్ట్రీషియన్-35, వెల్డర్-20.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: 1.12.2020
అధికారిక వెబ్ సైట్: https://mcf.indianrailways.gov.in
https://www.mcfrecruitment.in