NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

‘బ్లేమ్స్ ఇండియా’: కుమారస్వామి వ్యాఖ్యలను వక్రీకరించిన టైమ్స్ నౌ!


బెంగళూరు: పుల్వామా ఉగ్ర దాడిపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను టైమ్స్ నౌ ఛానల్ వక్రీకరించిన విధానంపై ‘ఆల్ట్‌న్యూస్’ ప్రతినిధి అర్జున్ సిద్ధార్థ్ ఒక ప్రత్యేక కథనం రాశారు. ఈ కథనంలో కుమారస్వామి ఏమన్నారు? టైమ్స్ నౌ ఏం రాసిందనే విషయాలను వివరించారు.

‘ఉగ్రదాడికి ప్రతీకర చర్యే సమాధానం కాదు. ఇలాంటి ఘటనలకు చోటులేని వాతావరణాన్ని కల్పించాలి. పాకిస్థాన్‌ ఉగ్రదేశంగా మారుతోందా లేదా అన్నది విషయం కాదు. మొదట భారతదేశంలో ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలి’ అని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు.

కుమారస్వామి కన్నడలో చేసిన ఈ వ్యాఖ్యలను టైమ్స్ నౌ ఛానల్ తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేసింది. ‘ఉగ్రవాదం విషయంలో కుమారస్వామి ఇండియాను తప్పుపడుతున్నారు. పాక్ ప్రమేయాన్నిఆయన ఖండించలేదు’ అనే శీర్షికతో టైమ్స్ నౌ కథనాలు ప్రచురితం చేసింది.

https://twitter.com/Waseem_Ahmed11/status/1097785268168314882

ఈ నేపథ్యంలో కుమారస్వామి ఏమన్నారు? మీరేం రాశారు అంటూ టైమ్స్ నౌ కథనంపై సోషల్ మీడియాలో కన్నడ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కన్నడ రాకుంటే మేమే అనువదించి ఇస్తామంటూ మండిపడ్డారు. ఉగ్రవాదం విషయంలో కుమారస్వామి ఇండియాను తప్పుబట్టలేదని అన్నారు. 40మంది జవాన్లు చనిపోతే బీజేపీ ప్రోపగాండను ప్రచారం చేస్తారా? అని మండిపడ్డారు.

టైమ్స్ నౌ కథనంలో వాస్తవం లేదని ఆదిత్య మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కన్నడ తెలిసిన వారికి కుమారస్వామి ఏం చెప్పారో స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం ఓ కన్నడ అనువాదకుడినైనా నియమించుకోవాలని హితవు పలికారు.

‘పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారులైన వారిని మట్టుబెట్టడం మంచి విషయమే. అయితే, మనం 40మంది జవాన్లను కోల్పోయిన తర్వాతే ఈ చర్యకు దిగడంలో ఫలితం లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అది ప్రభుత్వ బాధ్యత. పాకిస్థాన్ ఉగ్రవాద దేశమనడం వేరే విషయం.. కానీ, మనదేశంలో ఉగ్రవాదుల కార్యకలాపాలను లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. తుపాకీతోనే సాధ్యమవుతుందా? లేదా వారిలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారానా? మన జవాన్లను కోల్పోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలి’ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

తప్పుగా ప్రచారం చేసిన టైమ్స్ నౌ కథనంపై సీఎం కుమారస్వామి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని అన్నారు. ఉగ్రవాదం విషయంలో తాను ఇండియాను తప్పుబట్టలేదని తెలిపారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడంతోపాటు మనదేశాన్ని బలోపేతం చేసుకోవాలని మాత్రమే తాను సూచించినట్లు వెల్లడించారు.

ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో..
– అర్జున్ సిద్ధార్థ్

author avatar
Siva Prasad

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Leave a Comment