బెంగళూరు: పుల్వామా ఉగ్ర దాడిపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను టైమ్స్ నౌ ఛానల్ వక్రీకరించిన విధానంపై ‘ఆల్ట్న్యూస్’ ప్రతినిధి అర్జున్ సిద్ధార్థ్ ఒక ప్రత్యేక కథనం రాశారు. ఈ కథనంలో కుమారస్వామి ఏమన్నారు? టైమ్స్ నౌ ఏం రాసిందనే విషయాలను వివరించారు.
‘ఉగ్రదాడికి ప్రతీకర చర్యే సమాధానం కాదు. ఇలాంటి ఘటనలకు చోటులేని వాతావరణాన్ని కల్పించాలి. పాకిస్థాన్ ఉగ్రదేశంగా మారుతోందా లేదా అన్నది విషయం కాదు. మొదట భారతదేశంలో ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలి’ అని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు.
Karnataka CM, HD Kumaraswamy (@hd_kumaraswamy) blames India for ‘terrorism crisis’ #PulwamaPayback pic.twitter.com/di2vq2cCyy
— TIMES NOW (@TimesNow) February 19, 2019
కుమారస్వామి కన్నడలో చేసిన ఈ వ్యాఖ్యలను టైమ్స్ నౌ ఛానల్ తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేసింది. ‘ఉగ్రవాదం విషయంలో కుమారస్వామి ఇండియాను తప్పుపడుతున్నారు. పాక్ ప్రమేయాన్నిఆయన ఖండించలేదు’ అనే శీర్షికతో టైమ్స్ నౌ కథనాలు ప్రచురితం చేసింది.
https://twitter.com/Waseem_Ahmed11/status/1097785268168314882
ఈ నేపథ్యంలో కుమారస్వామి ఏమన్నారు? మీరేం రాశారు అంటూ టైమ్స్ నౌ కథనంపై సోషల్ మీడియాలో కన్నడ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కన్నడ రాకుంటే మేమే అనువదించి ఇస్తామంటూ మండిపడ్డారు. ఉగ్రవాదం విషయంలో కుమారస్వామి ఇండియాను తప్పుబట్టలేదని అన్నారు. 40మంది జవాన్లు చనిపోతే బీజేపీ ప్రోపగాండను ప్రచారం చేస్తారా? అని మండిపడ్డారు.
టైమ్స్ నౌ కథనంలో వాస్తవం లేదని ఆదిత్య మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కన్నడ తెలిసిన వారికి కుమారస్వామి ఏం చెప్పారో స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం ఓ కన్నడ అనువాదకుడినైనా నియమించుకోవాలని హితవు పలికారు.
Complete bullshit. This is why I have dropped Times Now on TV and twitter.
This is not what HDK has said at all. Anyone who understands Kannada will know this.
At least hire a decent Kannada translator, shitheads . https://t.co/FJ7s75naKC
— ?️Dℹ️TY?️ ♏️?️G?️L (@jhunjhunwala) February 19, 2019
‘పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారులైన వారిని మట్టుబెట్టడం మంచి విషయమే. అయితే, మనం 40మంది జవాన్లను కోల్పోయిన తర్వాతే ఈ చర్యకు దిగడంలో ఫలితం లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అది ప్రభుత్వ బాధ్యత. పాకిస్థాన్ ఉగ్రవాద దేశమనడం వేరే విషయం.. కానీ, మనదేశంలో ఉగ్రవాదుల కార్యకలాపాలను లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. తుపాకీతోనే సాధ్యమవుతుందా? లేదా వారిలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారానా? మన జవాన్లను కోల్పోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలి’ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
తప్పుగా ప్రచారం చేసిన టైమ్స్ నౌ కథనంపై సీఎం కుమారస్వామి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని అన్నారు. ఉగ్రవాదం విషయంలో తాను ఇండియాను తప్పుబట్టలేదని తెలిపారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడంతోపాటు మనదేశాన్ని బలోపేతం చేసుకోవాలని మాత్రమే తాను సూచించినట్లు వెల్లడించారు.
Dear @timesnow, it is highly condemnable to misquote me on a such serious issue. You have not only misquoted, but also misunderstood what I said. I did not blame India; I said that along with destroying the enemies we also need to make our country stronger. https://t.co/7ocCHgw9An
— H D Kumaraswamy (@hd_kumaraswamy) February 19, 2019
ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో..
– అర్జున్ సిద్ధార్థ్